సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయం.. మధ్య దళారుల కోరల నుంచి ప్రజలను ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం రక్షించింది మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ. ఎం. వెంకయ్యనాయుడు


ముస్లిం మహిళలకు విముక్తి కలిగించిన వ్యక్తిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తిండి పోతారు.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
ఎంపిక చేసిన ప్రధానమంత్రి ప్రసంగాలతో రూపొందిన 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్' ను ఆవిష్కరించిన శ్రీ వెంకయ్యనాయుడు

శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలు, సంక్లిష్ట సామాజిక అంశాలపై ఆయనకు ఉన్న అవగాహనకు పుస్తకం అద్దం పడుతుంది... శ్రీ అనురాగ్ రాకూర్

Posted On: 23 SEP 2022 4:27PM by PIB Hyderabad

ఎంపిక చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగాల సంకలనంగా రూపొందించిన 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్' పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు ఈ రోజు ఢిల్లీలో ఆవిష్కరించారు. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఏర్పాటు చేసిన ఆవిష్కరణ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. 2019 నుంచి 2020 మే వరకు ప్రధానమంత్రి చేసిన ప్రసంగాల నుంచి 86 ప్రసంగాలను 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్'లో పొందుపరిచారు. 

ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడిన శ్రీ వెంకయ్యనాయుడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సమస్యలను పరిష్కరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను లోతుగా అర్ధం చేసుకునేందుకు 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్' ఉపకరిస్తుందని అన్నారు. 'సర్వే జన సుఖినో భవన్' అనే విశాల దృక్పథంతో ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తున్నదని శ్రీ వెంకయ్యనాయుడు అన్నారు. గతంలో కూడా అనేక మంచి పథకాలు అమలు జరిగాయని పేర్కొన్న శ్రీ వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్ణీత కాల వ్యవధిలో, లక్ష్యాలను నిర్ణయించుకుని పథకాలు అమలు చేసున్నదని అన్నారు. నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణలో అమలు జరుగుతున్న కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయని శ్రీ వెంకయ్యనాయుడు తెలిపారు. అపారమైన వాక్చాతుర్యం వరంగా కలిగి ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలందరితో ఒకే విధంగా మమేకం అవుతున్నారని శ్రీ నాయుడు అన్నారు.

కోట్లాది బ్యాంకు ఖాతాలను తెరవడం సాధ్యం కాదని ప్రతి ఒక్కరూ భావించిన సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో లక్ష్యం సులువుగా నెరవేరిందని శ్రీ వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వం సాధించిన విజయాల్లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం అతి పెద్ద విజయమని శ్రీ వెంకయ్యనాయుడు వర్ణించారు. మధ్య దళారుల కోరల నుంచి ప్రజలను ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం రక్షించి సంక్షేమ ఫలాలు అర్హులైన వారికి చేరేలా చూసిందని అన్నారు. గతంలో పథకాలు ప్రభుత్వ లేదా రాజకీయ పథకాలుగా గుర్తింపు పొందాయని శ్రీ వెంకయ్యనాయుడు అన్నారు. అయితే, ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే పథకాలు విజయం సాధిస్తాయని శ్రీ నరేంద్ర మోదీ గుర్తించి అమలు చేశారని అన్నారు. భారత్ అభియాన్‌ను ప్రధానమంత్రి జన ఆందోళన (ప్రజా ఉద్యమం)గా మలిచి అమలు చేశారని శ్రీ వెంకయ్యనాయుడు వివరించారు. 

'గతంలో భారతదేశం బలంగా వినిపించేందుకు అవసరమైన స్థాయిలో లేదని చాలా కాలంగా ప్రజలు భావించారు అయితే, ప్రధాని మోడీ రాకతో భారతదేశం ఇప్పుడు బలమైన శక్తిగా మారింది మరియు భారతదేశ వాణి ప్రస్తుతం అందరికీ వినిపిస్తుంది." అని శ్రీ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. 

కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు మరియు మహిళా సాధికారత కోసం ప్రధానమంత్రి చేస్తున్న కృషి పుస్తకంలో ప్రతి అక్షరంలో కనిపిస్తుందని అన్నారు. మరుగుదొడ్ల సౌకర్యం , మంచి నీటి సరఫరా అనే రెండు అంశాలు అత్యంత కీలక సమస్యలని, గత ప్రభుత్వాలు వీటికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రెండు సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నదని శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అన్నారు. 

ట్రిపుల్ తలాక్‌పై అంశాన్ని ప్రస్తావించిన శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనేక శతాబ్దాలుగా అమలు జరుగుతున్న ఈ దురాచారాన్ని రద్దు చేయడం అనేది చిన్న విషయం కాదని అన్నారు. వివాహిత ముస్లిం మహిళలు విడాకుల బెదిరింపులతో నిరంతరం జీవించాల్సి వచ్చేదని అన్నారు. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన అతిపెద్ద వైఫల్యంగా భావించారని అన్నారు. ముస్లిం మహిళలకు హిందూ మహిళలతో సమానమైన హక్కులు కల్పించలేక పోయానని నెహ్రూ అనేవారని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్‌ రద్దు రాజకీయ, సామాజిక పరంగా కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభావం చూపిస్తుందని శ్రీ మహమ్మద్ అన్నారు. ముస్లిం మహిళలకు విముక్తి కల్పించిన నేతగా శ్రీ నరేంద్ర మోదీ గుర్తుండిపోతారు అని అన్నారు. అన్ని అసమానతలు మరియు వ్యతిరేకతలను ధైర్యంగా ఎదుర్కొని ట్రిపుల్ తలాక్‌ రద్దు వాగ్దానాన్ని నెరవేర్చిన ప్రధానమంత్రిని శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అభినందించారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు అభివృద్ధి అనేది ప్రభుత్వ, అధికార యంత్రాంగం బాధ్యతగా ఉండేదని శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే, ప్రధానమంత్రి ఈ భావనకు స్వస్తి చెప్పి దేశాభివృద్ధిలో ప్రజలకు స్థానం కల్పించారని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో అన్ని ప్రక్రియలు, ఫలితాల సాధనలో ప్రతి ఒక్కరికి సమాన పాత్ర కల్పించారని అన్నారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాల నుంచి 86 ప్రసంగాలను ఎంపిక చేసి 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్' ను రూపొందించామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ రాకూర్ వివరించారు. 10 అధ్యాయాలు కలిగిన 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్' లో పొందుపరిచిన ప్రసంగాలు జటిల సామాజిక అంశాలపై శ్రీ నరేంద్ర మోదీ కలిగి ఉన్న అవగాహన, స్పష్టమైన దృక్పథాన్ని వివరిస్తామని అన్నారు. భావి చరిత్రకారులకు ఈ సంకలనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

సంక్లిష్టమైన జాతీయ సమస్యలపై శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలు, శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వ లక్షణాలు ప్రసంగాల ద్వారా తెలుస్తుందని శ్రీ ఠాకూర్ అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ ఆలోచించి అమలు చేస్తున్న విధానాల వల్ల ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తుందని ఆయన అన్నారు. మధ్యవర్తుల బెడద లేకుండా, అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చేస్తున్న కృషిని గుర్తించిన ప్రజలు శ్రీ నరేంద్ర మోదీపై అచంచలమైన విశ్వాసాన్ని చూపిస్తున్నారని శ్రీ ఠాకూర్ అన్నారు. 

అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో మమేకమవ్వడంలో శ్రీ నరేంద్ర మోదీ అసాధారణ సామర్థ్యం కలిగి ఉన్నారని శ్రీ ఠాకూర్ ప్రశంసించారు. విద్యార్థుల నుండి మహిళల వరకు, రైతుల నుండి సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికుల వరకు, క్రీడాకారుల నుండి వ్యాపారవేత్తల వరకు ఎవరైనా ప్రధాని ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారని శ్రీ ఠాకూర్ అన్నారు. వివిధ అంతర్జాతీయ సర్వేలు పిఎం మోడీని ప్రపంచంలో అత్యంత ఇష్టమైన ప్రధానమంత్రిగా గుర్తించాయని పేర్కొన్నారు . నరేంద్ర మోడీ అంటే ఏమిటో ప్రపంచానికి చెందిన శక్తివంతమైన నాయకులు వివరంగా చెప్పారని శ్రీ ఠాకూర్ వ్యాఖ్యానించారు. 

శ్రీ నరేంద్ర మోదీ విదేశీ సంబంధాలపై చేసిన ప్రసంగాలు, ఆర్థిక వ్యవస్థపై ఆయన ఆలోచనలు, కాశీ విశ్వనాథ్ ధామ్, కేదార్‌నాథ్ ధామ్, అయోధ్య, దేవఘర్ మొదలైన ప్రదేశాలలో దేశ సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణపై ఆయన చేసిన పరిశీలనలు పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకం పాఠకులకు శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలు తెలియజేస్తుందని శ్రీ ఠాకూర్ చెప్పారు. భారతదేశ పర్యావరణం మరియు హరిత భారతదేశాన్ని రూపొందించడానికి తీసుకున్న చర్యలు, వివిధ మంత్రిత్వ శాఖల విజయాలు, ఫిట్‌నెస్, యోగా మరియు క్రీడలలో ప్రధాన స్రవంతి, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రభుత్వం సాధించిన విజయాలు, వ్యవసాయం, వ్యవసాయ-వ్యాపారాలు, ఉపాధి, గ్రామోదయ నుంచి రాష్ట్రోదయ వరకు , స్వావలంబన దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణం వివరాలు 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్' ద్వారా తెలుస్తాయని మంత్రి అన్నారు. 

వివిధ ప్రభుత్వ పథకాలపై శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనల ఎన్‌సైక్లోపీడియాగా ఉంటుంది. రాజ్యసభ 250వ సెషన్, 8 ఆగస్టు 2019 న ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత ASSOCHAM, జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసిన ప్రసంగం. కోవిడ్‌కు సంబంధించి 19 మార్చి 2020న దేశానికి అందించిన సందేశం, ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా చేసిన ప్రసంగం, అయోధ్యలో శ్రీ రామ జన్మభూమిపై సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత దేశానికి ఆయన ఇచ్చిన సందేశం మొదలైనవాటిని ఈ సంకలనంలో పాఠకులు తెలుసు కుంటారు. 

ఆర్టికల్ 370 రద్దుతో భారతదేశం మనుగడ సాగించదని, కాశ్మీర్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఒక్కరు కూడా ఎగురవేయరని వివిధ రాజకీయ నేతలు విమర్శిస్తూ చేసిన ప్రసంగాలకు ఈ పుస్తకం ద్వారా సమాధానం లభిస్తుందని మంత్రి చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు కాశ్మీర్‌లో హర్ ఘర్ తిరంగా ప్రచారం విజయాన్ని సాధించిందని పేర్కొన్న శ్రీ ఠాకూర్ కాశ్మీర్ మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి సాదిస్తున్నదని అన్నారు. 

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లికేషన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ శ్రీమతి మోనిదీపా ముఖర్జీ మరియు మంత్రిత్వ శాఖలోని వివిధ మీడియా విభాగాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్' పుస్తకం గురించి... 

ఈ పుస్తకం మే 2019 నుంచి మే 2020 వరకు వివిధ విషయాలపై ప్రధానమంత్రి చేసిన 86 ప్రసంగాల ఆధారంగా రూపొందింది. పది నేపథ్య ప్రాంతాలుగా ప్రసంగాలు విభజించబడ్డాయి. 'నవ భారతదేశం ' పై ప్రధాని ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. ఆత్మనిర్భర్ భారత్: ఆర్థిక వ్యవస్థ, ప్రజలు-ఫస్ట్ గవర్నెన్స్, కోవిడ్-19 కి వ్యతిరేకంగా పోరాటం, ఎమర్జింగ్ ఇండియా: విదేశీ వ్యవహారాలు , జై కిసాన్, టెక్ ఇండియా-న్యూ ఇండియా, గ్రీన్ ఇండియా-రెసిలెంట్ ఇండియా-క్లీన్ ఇండియా, ఫిట్ ఇండియా- సమర్థవంతమైన భారతదేశం, ఎటర్నల్ ఇండియా-ఆధునిక భారతదేశం: సాంస్కృతిక వారసత్వం మరియు మన్ కీ బాత్ విభాగాలుగా విభజించి పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. 

స్వావలంబన, దృఢత్వం మరియు సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త భారతదేశం గురించి ప్రధాని ఆలోచనలను పుస్తకం వర్ణిస్తుంది. ప్రధానమంత్రి తన అసాధారణమైన వక్తృత్వ శైలి ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు శ్రీ మోదీకి సహకరించిన నాయకత్వ లక్షణాలు, అద్భుతమైన కమ్యూనికేషన్ సామర్థ్యం, దూరదృష్టితో కూడిన ఆలోచన మరియు దూరదృష్టి ఈ పుస్తకం ప్రతిబింబిస్తుంది.

 పబ్లికేషన్స్ డివిజన్ విక్రయ కేంద్రాలలో మరియు న్యూ ఢిల్లీలోని CGO కాంప్లెక్స్‌లోని సూచనా భవన్‌లోని పుస్తకాల గ్యాలరీలో ఇంగ్లీష్ మరియు హిందీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని పబ్లికేషన్స్ డివిజన్ వెబ్‌సైట్‌తో పాటు భారత్‌కోష్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. పుస్తకాలు అమెజాన్ మరియు గూగుల్ ప్లే లో కూడా అందుబాటులో ఉన్నాయి.

 

***



(Release ID: 1861808) Visitor Counter : 190