బొగ్గు మంత్రిత్వ శాఖ

రేపే ప్రారంభం కానున్న 10 వాణిజ్య బొగ్గు గ‌నుల‌కు ఇ-వేలం

Posted On: 12 SEP 2022 5:39PM by PIB Hyderabad

 బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన నియుక్త అధికార సంస్థ వాణిజ్య బొగ్గు గ‌నుల కోసం బిడ్ల‌ను ఆహ్వానించింది. బిడ్ల సాంకేతిక మూల్యాంక‌నం పూర్తి అయ్యి, 10 బొగ్గు గ‌నుల కోసం ఫార్వార్డ్ ఇ- వేలాన్ని మంగ‌ళ‌వారం ప్రారంభిస్తారు. 
ఎనిమిది బొగ్గుల‌కు ఇ- వేలాన్ని 13 సెప్టెంబ‌ర్ న‌, మిగిలిన రెండు బొగ్గు గ‌నుల‌కు 14 సెప్టెంబ‌ర్ 2022న ఇ- వేలం జ‌రుగ‌నుంది. ఇ-వేలం వేయ‌నున్న గ‌నుల మొత్తం గ‌రిష్ట రేటు సామ‌ర్ధ్యం (పిఆర్‌సి) ఏడాదికి 39.31 మిలియ‌న్ ట‌న్నులు. 
బొగ్గు మంత్రిత్వ శాఖ నియుక్త అధికార సంస్థ నేటివ‌ర‌కు ఏడాదికి మొత్తం 85.54 పిఆర్‌సి  43 బొగ్గునుల‌ను విజ‌య‌వంతంగా వేలం వేసింది.

***


 



(Release ID: 1858830) Visitor Counter : 108