రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారతదేశపు తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నుకొచ్చిలో జరిగిన కార్యక్రమం లో నౌకాదళం లోకి ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ'


ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక మాత్రమే కాదు. 21వ శతాబ్దపుభారతదేశం కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం

ఐఎన్ఎస్ విక్రాంత్ స్వదేశీ సామర్థ్యాలు, స్వదేశీ వనరులు, స్వదేశీ నైపుణ్యాలకు చిహ్నం: ప్రధాని

వలస గతం నుండి నిష్క్రమణకు గుర్తుగా, నౌకాదళానికి సరికొత్త గుర్తును ఆవిష్కరించి, ఛత్రపతి శివాజీకి అంకితం చేసిన ప్రధాన మంత్రి

ఐఎన్ఎస్ విక్రాంత్ ను ఆకాంక్షాత్మక, స్వావలంబన కలిగిన 'నవ భారతానికి' ప్రకాశవంతమైన ప్రతిబింబంగా అభివర్ణించిన రక్షణ మంత్రి

రాబోయే 25 ఏళ్లలో దేశ భద్రతకు , రక్షణ కల్పించాలనే మా సంకల్పానికి ఇది నిదర్శనం

ఐఎన్ఎస్ విక్రాంత్ దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షిస్తుంది:రాజ్ నాథ్ సింగ్

Posted On: 02 SEP 2022 12:02PM by PIB Hyderabad

స్వదేశీ తయారీలో దేశంలో పెరుగుతున్న నైపుణ్యాన్ని, 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా పయనంలో ఒక ప్రధాన మైలురాయిని ప్రదర్శిస్తూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2, 2022 న కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (సిఎస్ఎల్) లో దేశంలోని తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్ఎస్) విక్రాంత్ ను నౌకాదళం లోకి ప్రవేశ పెట్టారు. ఈ కార్యక్రమం సందర్భంగా నౌకాదళానికి సరికొత్త గుర్తు(నిషాన్)ను ఆవిష్కరించారు, వలసవాద గతాన్ని పారద్రోలుతూ, సుసంపన్నమైన భారతీయ సముద్ర వారసత్వానికి యోగ్యతను కల్పించే విధంగా తయారు చేసిన సరికొత్త గుర్తును ఛత్రపతి శివాజీకి ప్రధాని అంకితం చేశారు.

 

స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఇక్క‌డ కేర‌ళ తీరంలో ప్ర‌తి భార‌తీయుడు కొత్త భ‌విష్య‌త్తుకు సంబంధించిన సూర్యోదయాన్ని చూస్తున్నాడు. ఐఎన్ఎస్ విక్రాంత్ లో జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రపంచ క్షితిజంపై భారతదేశం పై పెరుగుతున్న స్ఫూర్తికి నివాళి. స్వాతంత్య్ర సమరయోధుల కలల సాక్షాత్కారాన్ని నేడు మనం చూస్తున్నామని ఆయన అన్నారు. వారు సమర్థవంతమైన, బలమైన భారతదేశాన్ని ఊహించారని ఆయన అన్నారు. "విక్రాంత్ చాలా పెద్దది, భారీ, విశాలమైనది. విక్రాంత్ విశిష్టమైనది, విక్రాంత్ కూడా ప్రత్యేకమే.. విక్రాంత్ కేవలం యుద్ధనౌక మాత్రమే కాదు. 21వ శతాబ్దంలో భారతదేశం కృషి, ప్రతిభ, ప్రభావం మరియు నిబద్ధతకు ఇది నిదర్శనం. లక్ష్యాలు దూరమైనా, ప్రయాణాలు సుదూరమైనా, సాగరమైనా, సవాళ్లు అంతులేనివి అయితే – భారతదేశం సమాధానం విక్రాంత్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సాటిలేని అమృతం విక్రాంత్. విక్రాంత్ భారతదేశం స్వయం సమృద్ధిగా మారడానికి ఒక ప్రత్యేక ప్రతిబింబం అని ప్రధానమంత్రి తెలిపారు.

 

దేశం సరికొత్త మానసిక స్థితి గురించి ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, నేటి భార‌త‌దేశానికి ఏ స‌వాల్ కూడా చాలా క‌ష్టం కాదు. స్వదేశీ సాంకేతికతతో ఇంత భారీ విమాన వాహక నౌకను తయారు చేస్తున్న ప్రపంచంలోని ఆ దేశాలలో ఈరోజు భారత్ చేరిందన్నారు. ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్ దేశంలో కొత్త విశ్వాసాన్ని నింపింది మరియు దేశంలో కొత్త ఆత్మ విశ్వాసాన్ని సృష్టించింది. నావికాదళం, కొచ్చిన్ షిప్‌యార్డ్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు మరియు ప్రత్యేకంగా ప్రాజెక్ట్‌ లో పనిచేసిన కార్మికుల సహకారాన్ని ప్రధాన మంత్రి గుర్తించి, ప్రశంసించారు. ఓనం యొక్క సంతోషకరమైన మరియు పవిత్రమైన సందర్భాన్ని కూడా ఆయన గమనించారు, ఇది ఈ సందర్భానికి మరింత ఆనందాన్ని జోడిస్తుంది.

 

ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రతి భాగానికి దాని స్వంత యోగ్యతలు, ఒక బలం, దాని స్వంత అభివృద్ధి ప్రయాణం ఉన్నాయి. ఇది స్వదేశీ సామర్థ్యాలు, స్వదేశీ వనరులు మరియు స్వదేశీ నైపుణ్యాలకు చిహ్నంగా ఉంది. తన వైమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన ఉక్కు కూడా దేశీయమైనదని, డీఆర్డీవో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని, భారతీయ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని ఆయన చెప్పారు. వాహకనౌక యొక్క భారీ నిష్పత్తిని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఇది తేలియాడే నగరం లాంటిదని అన్నారు. ఇది 5000 గృహాలకు విద్యుత్తును అందించడానికి సరిపోయే విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని, ఉపయోగించిన వైరింగ్ కొచ్చి నుండి కాశీకి చేరుకుంటుందని ఆయన చెప్పారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎర్రకోట బురుజుల నుండి తాను ప్రకటించిన పంచ ప్రాణుల ఆత్మకు సజీవ ప్రతిరూపమని ఆయన అన్నారు.

 

ఐఎన్ఎస్ విక్రాంత్ లో ప్రతి ఒక్క భాగాని కి దానికంటూ ఒక సుగుణం, ఒక శక్తి, దానికంటూ ఒక అభివృద్ధి క్రమం అనేవి సైతం ఉన్నాయి. దీని రూపకల్పన జరిగిన తీరే అపురూపం, అది దేశవాళీ సామర్థ్యం, దేశవాళీ వనరులు, దేశవాళీ నైపుణ్యాల కు ఒక సంకేతం గా ఉంది. దీని యొక్క ఎయర్ బేస్ లో అమర్చినటువంటి ఉక్కు ను డిఆర్ డిఒ కు చెందిన శాస్త్రవేత్త లు అభివృద్ధి పరచగా, భారతదేశం లోని కంపెనీ లు ఆ యొక్క ఉక్కు ను ఉత్పత్తి చేశాయి అని ఆయన తెలిపారు. ఈ నౌక లో విశాలమైన భాగాల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, చూడబోతే ఇది సముద్రం అలల పైన తేలి ఆడుతున్నటువంటి ఒక నగరమా అన్నట్లుగా ఉందన్నారు. ఇది ఎంతటి విద్యుత్తు ను తయారు చేస్తుంది అంటే ఆ విద్యుత్తు 5,000 కుటుంబాలు వినియోగించుకోవడాని కి సరిపోతుంది, మరి దీనిలో వినియోగించిన విద్యుత్తు తంత్రుల ను గనక పరుచుకుంటూ పోతే అవి కోచి నుండి కాశీ కి చేరుకొంటాయి అని ఆయన అన్నారు. ఎర్ర కోట బురుజు ల నుండి తాను ప్రకటించిన ‘పంచ ప్రణ్’ ల యొక్క భావన కు ఒక సంగ్రహమైన సజీవ ప్రతీక లా ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది అని ఆయన అన్నారు.

భారతదేశం సముద్ర సంబంధి సంప్రదాయం, నౌకాదళ శక్తియుక్తుల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఛత్రపతి వీర్ శివాజీ మహారాజ్ ఈ తరహా నౌకాదళాన్ని నిర్మించారు, మరి ఈ సముద్ర సంబంధి శక్తి యొక్క అండదండలే శత్రువుల కు కంటి మీద కునుకు లేకుండా చేసివేసేవి. బ్రిటిషు వారు భారతదేశాని కి తరలి వచ్చినప్పుడు, వారు భారతదేశాని కి చెందిన నౌకల ను చూసి, వాటి ద్వారా జరిగే వ్యాపారం తాలూకు బలాన్ని చూసి గుబులుపడే వారు. ఈ కారణం గా వారు భారతదేశం యొక్క సముద్ర సామర్థ్యం వెన్ను ను విరచాలనే నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఏ విధంగా ఆ కాలం లో బ్రిటిషు పార్లమెంటు లో చట్టాన్ని చేసి భారతదేశాని కి చెందిన నౌకల పైన మరియు వర్తకుల పైన కఠినమైన ఆంక్షల ను విధించారో దానికి చరిత్ర యే సాక్షి గా నిలచింది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ రోజు న 2022వ సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీ ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు, నేటి రోజు న భారతదేశం బానిసత్వం తాలూకు ఒక గుర్తు ను, బానిసత్వం యొక్క ఒక పెద్ద భారాన్ని గుండె మీద నుండ వదలించుకొన్నది. ఈ రోజు నుండి భారతదేశం నౌకాదళానికి ఒక కొత్త జెండా లభించింది. ఇంత వరకు భారతదేశం నౌకాదళం యొక్క ధ్వజం దాస్యం లో మగ్గిపోయి ఉండేది, కానీ ఈ రోజు మొదలుకొని ఛత్రపతి శ్రీ శివాజి యొక్క ప్రేరణ తో నౌకాదళం యొక్క నూతన పతాకం సముద్రం లో, ఆకాశం లో రెపరెప లాడుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

విక్రాంత్ మన సముద్ర రంగ సురక్ష కోసం ఎప్పుడైతే రంగం లోకి దిగుతుందో, అప్పుడు దానిలో నౌకాదళాని కి చెందిన అనేక మంది మహిళా జవాను లు కూడాను మోహరించి ఉంటారు అని ప్రధాన మంత్రి అన్నారు. సముద్రాని కి ఉన్న అపారమైన శక్తి తో పాటు ఎల్ల లు ఎరుగనటువంటి నారీ శక్తి ఇవి నవ భారతదేశం తాలూకు సమున్నత గుర్తింపు గా మారుతున్నాయన్నారు. ఇక భారతదేశం నౌకాదళం తన అన్ని విభాగాల ను మహిళల ను భర్తీ చేసుకోవడం కోసం అనుమతించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న ఆంక్షల ను ఇక తొలగించడం జరుగుతోంది. సమర్థమైన అలల కు ఎలాగయితే పరిధులు అంటూ ఉండవో, అలాగే భారతదేశాని కి చెందిన కుమార్తె ల కు ఇక ఎటువంటి ఎల్లలు గాని లేదా బంధనం గాని ఉండవు అని ఆయన అన్నారు.

ఒక్కొక్క బిందువే ఒక విరాట మహాసముద్రంగా మారుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సారి స్వాతంత్య్ర దినం నాడు స్వదేశీ ఫిరంగుల తో వందన సమర్పణ జరిగింది అని కూడా ఆయన ప్రస్తావించారు. అదే విధం గా భారతదేశం లో ప్రతి ఒక్క పౌరుడు/ పౌరురాలు ‘వోకల్ ఫార్ లోకల్’ (స్వదేశీ ఉత్పత్తుల ను సమర్థించుదాం) అనే మంత్రాన్ని అనుసరిస్తూ మనుగడ సాగించడాన్ని మొదలు పెడతారని, అదే జరిగినప్పుడు దేశం స్వయం సమృద్ధం కావడానికి ఎక్కువ కాలం పట్టదు అని ఆయన అన్నారు.

భౌగోళికం గా మరియు వ్యూహాత్మకం గా పరిస్థితి లో మార్పులు చోటుచేసుకోవడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, గత కాలం లో ఇండో- పసిఫిక్ రీజియన్ లోను, హిందూ మహాసముద్ర ప్రాంతం లోను భద్రత పరమైనటువంటి ఆందోళనల ను ఎంతో కాలం పాటు చిన్నచూపు చూడడం జరిగిందన్నారు. అయితే, ప్రస్తుతం ఈ ప్రాంతం మనలకు దేశం యొక్క ప్రధానమైన రక్షణ ప్రాథమ్యం గా ఉందని ఆయన చెప్పారు. ఈ కారణం గానే మేం నౌకాదళాని కి ఉద్దేశించిన బడ్జెటు ను పెంచడం మొదలుకొని, నౌకాదళం శక్తియుక్తుల ను అధికం చేయడం కోసం ప్రతి దిశ లో కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. శక్తిశాలి భారతదేశం ఒక శాంతియుతమైనటువంటి మరియు భద్రమైనటువంటి ప్రపంచాని కి బాట ను పరచగలదని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ సందర్బం లో కేర‌ళ గ‌వ‌ర్న‌రు శ్రీ ఆరిఫ్ మొహ‌మ్మ‌ద్ ఖాన్, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరాయీ విజయన్, కేంద్ర మంత్రులు శ్రీయుతులు రాజ్ నాథ్ సింహ్, శ్రీ సర్బానంద సోనోవాల్, వి. మురళీధరన్, అజయ్ భట్, జాతీయ భద్రత సలహాదారు శ్రీ అజీత్ డోభాల్, నౌకాదళం ప్రధానాధికారి శ్రీ ఆర్. హరి కుమార్ లు సహా ఇతరులు హాజరు అయ్యారు.

ఐఎన్ఎస్ విక్రాంత్

ఐఎన్ఎస్ విక్రాంత్ కు ఆకృతి ని భారతదేశం నౌకాదళం లోని వార్ శిప్ డిజైన్ బ్యూరో (డబ్ల్యుడిబి) అందించగా, ఈ నౌక ను నౌకాశ్రయాలు, శిపింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో నడుస్తున్న సార్వజనిక రంగానికి చెందిన శిప్ యార్డ్ కంపెనీ కోచీన్ శిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. అత్యాధునిక ఆటోమేశన్ సదుపాయాల తో విక్రాంత్ ను నిర్మించడమైంది. అది భారతదేశం యొక్క సముద్ర సంబంధి చరిత్ర లో ఇంతవరకు నిర్మాణం అయిన నౌక లు అన్నిటిలోకీ అతి విశాలమైన నౌక అని చెప్పుకోవాలి.

ఈ దేశవాళీ విమాన వాహక నౌక కు దీనికి ముందు సేవల ను అందించినటువంటి మరియు భారతదేశాని కి తొలి యుద్ధ విమాన వాహక నౌక అయినటువంటి నౌక యొక్క పేరు నే పెట్టారు. ఆ నౌక 1971వ సంవత్సరం జరిగిన యుద్ధం లో ఒక ముఖ్య పాత్ర ను పోషించింది. తాజా నౌక కు స్వదేశీ ఉపకరణాల ను, యంత్ర పరికరాల ను పెద్ద సంఖ్య లో అమర్చడం జరిగింది. వీటి నిర్మాణం దేశం లోని ప్రధానమైన పారిశ్రామిక సంస్థ లు మరియు 100 కు పైగా సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా వాణిజ్య సంస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) ల ద్వారా జరిగింది. విక్రాంత్ ను దేశ సేవ కు సమర్పణం చేయడం తో ఇక భారతదేశం వద్ద రెండు యుద్ధ విమాన వాహక నౌక లు క్రియాశీలం కానున్నాయి; వాటి తో దేశ సముద్ర సంబంధి సురక్ష కు చాలా బలం లభిస్తుంది.

వలస హయాము సంప్రదాయాని కి అతీతం గా, సమృద్ధమైన భారతదేశ సముద్ర సంబంధి వారసత్వ ప్రతీక కు అనుగుణం గా రూపొందించినటువంటి నౌకాదళ నూతన ధ్వజాన్ని (చిహ్నాన్ని) కూడా ప్రధాన మంత్రి ఇదే కార్యక్రమం లో ఆవిష్కరించారు.

 

***



(Release ID: 1856309) Visitor Counter : 295