వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖరీఫ్ పంట కాలం 2021-22 మరియు రబీ పంట కాలం 2022-23 లో కనీస మద్దతు ధర చెల్లించి పంటల సేకరణ


2022 ఆగస్టు 30 వరకు 861.30 ఎల్ఎంటీ వరి సేకరణ. కనీస మద్దతు ధరగా 1,72,734.69 కోట్ల రూపాయలు పొంది లబ్ధి పొందిన 130.65 లక్షల మంది రైతులు

2022 ఆగస్టు 30 వరకు 187.92 ఎల్ఎంటీ గోధుమల సేకరణ. కనీస మద్దతు ధరగా 37,866.13 కోట్ల రూపాయలు పొంది లబ్ధి పొందిన 17.83 లక్షల మంది రైతులు

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2022 5:26PM by PIB Hyderabad

 

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2021-22 ఖరీఫ్ పంట కాలంలో సెంట్రల్ పూల్ కోసం సేకరిస్తున్న వరి  ధాన్యం సేకరణ సజావుగా లక్ష్యాల మేరకు సాగుతున్నది. సెంట్రల్ పూల్ కోసం  30.08.2022 నాటికి of 881.30 ఎల్ఎంటీల ( 759.32 ఎల్ఎంటీ ఖరీఫ్  పంట, 121.98 ఎల్ఎంటీ రబీ పంట)  వరి ధాన్యం సేకరించడం జరిగింది. కనీస మద్దతు చెల్లించి పంటను సేకరించడం వల్ల 130.65 మంది రైతులు ప్రయోజనం పొందారు. కనీస మద్దతు ధరగా రైతులకు 1,72,734.69 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. 

2022-23 రబీ పంట కాలంలో గోధుమల  సేకరణ 

2022-23 పంట కాలంలో 30.08.2022 నాటికి  187.92 ఎల్ఎంటీల గోధుమలను సేకరించడం జరిగింది. కనీస మద్దతు ధ్రజ్ రైతులకు 37,866.13 కోట్ల రూపాయల మేరకు చెల్లించడం జరిగింది. దీనివల్ల 17.83 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు.

 

****

 


(రిలీజ్ ఐడి: 1855846) సందర్శకుల సూచీ సంఖ్య : : 393
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , Urdu , हिन्दी , Punjabi , Odia , English