మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

నూతన భారతదేశం కోసం పాఠ్యాంశాలను సిద్ధం చేయడానికి పౌర సర్వేలో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


ఎన్ఈపి 2020కి అనుగుణంగా జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ - వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది : శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 16 AUG 2022 3:54PM by PIB Hyderabad

కొత్త పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ కోసం పౌర సర్వేలో పాల్గొనాలని కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రజలను కోరారు. ఎన్ఈపి 2020కి అనుగుణంగా డైనమిక్ నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్-  వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ప్రపంచ దృక్పథం తో పాటు సాంస్కృతిక-మూలాలను ఏకీకృతం చేయడానికి, వలసవాద ఆలోచనల నుండి విద్యను విముక్తి చేయడానికి, మన తర్వాతి తరాలలో ఎంతో గర్వాంగా చెప్పుకునే శక్తివంతమైన, చైతన్యవంతమైన, సమగ్రమైన, భవిష్యత్తు జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం చాలా అవసరమని ఆయన అన్నారు.

జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం, సిలబస్, పాఠ్యపుస్తకాలు, ఇతర బోధనా సామగ్రి రూపకల్పన కోసం ఆన్‌లైన్ పబ్లిక్ కన్సల్టేషన్ సర్వే ద్వారా విద్యా మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానించింది.
 

భారత ప్రభుత్వం 29 జూలై 2020న జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి), 2020ని ప్రకటించింది, ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ (ఎన్ సి ఎఫ్) అభివృద్ధి ద్వారా విద్యా వ్యవస్థ  నాణ్యతను మెరుగుపరచాలని సిఫార్సు చేస్తుంది. జిల్లా సంప్రదింపుల కమిటీలు, స్టేట్ ఫోకస్ గ్రూప్‌లు, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ, నేషనల్ ఫోకస్ గ్రూప్‌లు, నేషనల్ స్టీరింగ్ కమిటీ మొదలైన వాటి ద్వారా నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ ప్రక్రియ ప్రారంభమైంది. 

టెక్ ప్లాట్‌ఫారమ్ - వెబ్‌సైట్, మొబైల్ యాప్, పేపర్‌లెస్ పద్ధతిలో పనిని అమలు చేయడానికి అభివృద్ధి చేశారు. తల్లిదండ్రులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు వంటి వాటాదారులను చేరుకోవడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు బాటమ్-అప్ విధానాన్ని ఉపయోగించి, జిల్లా స్థాయి సంప్రదింపులు, మొబైల్ యాప్-ఆధారిత సర్వేలు, స్టేట్ ఫోకస్ గ్రూపులు, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ద్వారా రాష్ట్ర స్థాయి సంప్రదింపులు నిర్వహించాయి. అధ్యాపకులు, విద్యార్థులు మొదలైనవారు క్షేత్ర స్థాయిలో ఉన్నారు. పాఠశాల విద్య, బాల సంరక్షణ విద్య, ఉపాధ్యాయ విద్య, వయోజన విద్య భవిష్యత్తు గురించి వారి అభిప్రాయాలు సేకరిస్తారు.
 

జాతీయ స్థాయిలో కూడా నేషనల్ ఫోకస్ గ్రూప్‌లు, నేషనల్ స్టీరింగ్ కమిటీ వివిధ మంత్రిత్వ శాఖలు, స్వయంప్రతిపత్త సంస్థలు, ఎన్ జి ఓ లు, కార్పొరేట్లు, దాతృత్వ సంస్థలు మొదలైన వాటితో సంకర్షణతో సహా వివిధ సమస్యలు, ఆందోళనలపై చర్చించడానికి నిమగ్నమై ఉన్నాయి. s.

దేశంలోని వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, సంబంధిత సాధారణ ఆందోళనలపై అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా, తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు లేదా విద్యార్థి, భారతదేశంలోని విద్యా వ్యవస్థ పరివర్తనలో పాల్గొనడానికి ఇష్టపడే ప్రతి వాటాదారునికి అవకాశం కల్పించడం ప్రస్తుత అవసరం. ఇటువంటి బహుళ, విభిన్న వీక్షణలు ఎన్ఈపి 2020  విజన్‌ని సజావుగా అమలు చేయడానికి ఆచరణాత్మక రోడ్ మ్యాప్‌ను అందించే అవకాశం ఉంది.

ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల నాయకులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, కమ్యూనిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, చేతివృత్తులవారు, రైతులు మరియు పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్యపై ఆసక్తి ఉన్న వారందరితో సహా అన్ని వాటాదారులు ఇందులో పాల్గొనవలసి ఉంటుంది. ఈ ఆన్‌లైన్ సర్వే మన రాజ్యాంగంలోని VIII షెడ్యూల్‌లోని భాషలతో సహా 23 భాషలలో నిర్వహిస్తారు. 

 

అంతా చేరండి, ఆన్‌లైన్ సర్వేలో పాల్గొనండి. భారతదేశంలో దృఢమైన, స్థితిస్థాపకమైన, పొందికైన విద్యా వ్యవస్థను రూపొందించడంలో సహకరించండి. ఇప్పుడే ఆన్‌లైన్ సర్వే చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి:

https://ncfsurvey.ncert.gov.in

***



(Release ID: 1852401) Visitor Counter : 174