ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ కె. కామరాజ్ గారి ని ఆయన జయంతి సందర్భం లో స్మరించుకొన్న ప్రధానమంత్రి

Posted On: 15 JUL 2022 9:28AM by PIB Hyderabad

శ్రీ కె. కామరాజ్ గారి ని ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. భారతదేశం యొక్క స్వాతంత్య్ర పోరాటాని కి చెరిగిపోనటువంటి తోడ్పాటు ను శ్రీ కె. కామరాజ్ గారు అందించారు. అంతేకాకుండా, ఒక కరుణాభరితమైనటువంటి పాలకుని గా కూడా ఆయన తనదైన ముద్ర ను వేశారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ కె. కామరాజ్ గారి ని ఆయన జయంతి నాడు గుర్తు కు తెచ్చుకొంటున్నాను. భారతదేశం యొక్క స్వాతంత్య్ర పోరాటానికి చెరపలేనటువంటి తోడ్పాటు ను ఆయన అందించారు. అంతేకాక, దయాపూరితమైనటువంటి పరిపాలకుని గా కూడా గుర్తింపు ను తెచ్చుకొన్నారు. పేదరికాన్ని మరియు మానవుల ఇక్కట్టుల ను తగ్గించడానికి ఆయన కఠోరమైన శ్రమ ను చేశారు; విద్య మరియు ఆరోగ్యం రంగాల ను మెరుగుపరచడం పైన సైతం కామరాజ్ గారు శ్రద్ధ తీసుకొన్నారు.’’ అని పేర్కొన్నారు.

***

DS/ST

 

 

 



(Release ID: 1841812) Visitor Counter : 142