ప్రధాన మంత్రి కార్యాలయం

ముంబయి లో భవనం కూలిన ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు బాధపడ్డ ప్రధాన మంత్రి


పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ఆయన ప్రకటించారు

Posted On: 28 JUN 2022 9:26PM by PIB Hyderabad

ముంబయి లో భవనం కూలిన ఘటన లో బాధితుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని కూడా ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘ముంబయి లో భవనం కూలిన ఘటన బాధ ను కలిగించింది. ఈ దుఃఖ ఘడియ లో ప్రియతముల ను కోల్పోయి శోకసంతప్తులైన కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను. మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున అందజేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి మోదీ’’ అని పేర్కొంది.

 

 



(Release ID: 1837869) Visitor Counter : 83