ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 టీకాల వేగాన్ని మరింత పెంచడానికి పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమం గత ఏడాది జనవరి 16న ప్రారంభమైంది. కొవిడ్ టీకాల సార్వత్రికీకరణ కొత్త దశ 2021 జూన్‌ 21 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరిన్ని టీకాల లభ్యత, టీకాల లభ్యతపై దూరదృష్టిని పెట్టడం ద్వారా టీకా కార్యక్రమం వేగవంతమైంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చక్కటి ప్రణాళికతో పని చేయడానికి, టీకా సరఫరా గొలుసును క్రమబద్ధీకరించడానికి దీనిని ప్రారంభించారు. సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా కొవిడ్ టీకాలను అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తోంది. టీకా సార్వత్రీకరణ కొత్త దశలో, దేశంలో తయారవుతున్న టీకాల్లో 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించి, వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది. టీకా డోసులు (జూన్‌ 27, 2022 నాటికి) పంపిణీ చేసినవి 1,93,53,58,865 అందుబాటులోని నిల్వలు 11,99,66,130 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్


12-14 ఏళ్ల వారికి 3.63 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 94,420

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 17,073

ప్రస్తుత రికవరీ రేటు 98.57%

వారపు పాజిటివిటీ రేటు 3.39%

Posted On: 27 JUN 2022 9:29AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 197.11 కోట్ల ( 1,97,11,91,329 ) డోసులను అధిగమించింది. 2,56,08,118 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.60 కోట్లకు పైగా ( 3,60,03,591 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,08,715

రెండో డోసు

1,00,61,938

ముందు జాగ్రత్త డోసు

56,33,153

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,23,127

రెండో డోసు

1,76,21,255

ముందు జాగ్రత్త డోసు

1,00,17,163

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,63,25,473

రెండో డోసు

2,26,05,533

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,03,10,898

రెండో డోసు

4,83,94,953

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,81,18,357

రెండో డోసు

50,02,44,468

ముందు జాగ్రత్త డోసు

25,77,906

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,34,25,151

రెండో డోసు

19,32,03,498

ముందు జాగ్రత్త డోసు

23,70,927

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,72,35,709

రెండో డోసు

12,06,58,820

ముందు జాగ్రత్త డోసు

2,35,54,285

ముందు జాగ్రత్త డోసులు

4,41,53,434

మొత్తం డోసులు

1,97,11,91,329

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 94,420. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.22 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.57 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 15,208 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,27,87,606 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 17,073 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,03,604 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86.10 కోట్లకు పైగా ( 86,10,15,683 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 3.39 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.62 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1837245) Visitor Counter : 112