యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

2028 ఒలింపిక్స్‌లో భారత హాకీ అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉంది, హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్ అంచనా

Posted On: 10 JUN 2022 1:39PM by PIB Hyderabad

భారత హాకీ జట్టు 2028 ఒలింపిక్స్‌లో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని స్వర్ణ పతకాన్ని అందుకోవడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని భారత మాజీ హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్ అభిప్రాయపడ్డారు.

'2024 మరియు 2028 జట్టులోని అత్యధికులు  ప్రస్తుత జూనియర్ ప్రపంచ కప్ ఆటగాళ్లే. వారు అప్పటికి దాదాపు 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతారు. అలాగే ఒక్కొక్కరికి దాదాపు 30 సంవత్సరాలు ఉంటాయి' అని  ఖేలో ఇండియా యూత్ గేమ్‌ల మ్యాచ్‌లో ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిడిని అధిగమించడానికైనా జట్టుకు సరైన అనుభవం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
image.png
 ఇటీవల టోక్యో గేమ్స్‌లో పురుషులు కాంస్యం గెలుపొందడం మరియు మహిళలు నాల్గవ స్థానంలో నిలవడం ద్వారా భారత హాకీ మనల్ని ఉత్తేజపరిచే పునరుజ్జీవన సంకేతాలను చూపింది.

"ఇవి భారత్‌కు ఉత్తేజకరమైన సమయాలు, అయితే జర్మనీ, ఆస్ట్రేలియా, బెల్జియం మరియు హాలండ్‌తో సహా అనేక స్క్వాడ్‌లు కూడా మెరుగవుతున్నాయి" అని డేవిడ్ హెచ్చరించారు.

రాజీనామా చేయడానికి ముందు చాలా సంవత్సరాలు టీమ్ ఇండియాలో ఉన్న హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్..ఒడిశా హాకీ డైరెక్టర్‌గా తిరిగి దేశానికి వచ్చారు. ముఖ్యంగా క్రీడలను ఇష్టపడే రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పూర్తి మద్దతును కలిగి ఉన్నందున అతను తన నియామకంతో ఉత్సాహంగా ఉన్నారు.

' ఇది చాలెంజింగ్ రోల్. కానీ ఒడిశా బలంగా మారితే, భారత హాకీ పురుషులు మరియు స్త్రీల జట్టు బలంగా మారుతుంది '  అని  వివరించారు. తన లక్ష్యం మరియు సంక్షిప్త లక్ష్యం తన జట్టును దేశంలో నంబర్ 1గా చేయడమే' అని చెప్పారు.

ఈ లక్ష్య సాధనలో, ఒడిశా ఇప్పటికే హాకీ కోసం మరో 20 సింథటిక్ టర్ఫ్‌లను నిర్మిస్తోంది. అది కూడా రాష్ట్రంలోని సహజమైన ప్రతిభతో పాటు విస్తారమైన పేదరికం ఉన్నచోట ఈ అభివృద్ధి జరుగుతోంది.

"త్వరలో మా పిల్లలు అట్టడుగు స్థాయి నుండి సింథటిక్ మీద ఆడతారు గడ్డి మీద కాదు," ఇది భారతీయ హాకీకి ఏకైక మార్గం అనే ప్రసిద్ధ భావనను ధృవీకరిస్తుందన్నారు.

"ఈ కొత్త టర్ఫ్‌లలో ప్రతిదానిలో మంచి కోచ్‌లను ఉంచడం మా తదుపరి దశ, తద్వారా వారు అట్టడుగు స్థాయిలోనే అత్యుత్తమ కోచింగ్‌ను అందుకుంటారు. 8 సంవత్సరాలలో మీరు హాకీలో భిన్నమైన ఒడిషాను చూస్తారని, ఆశాజనక భారతదేశాన్ని చూస్తారని ఆశిస్తున్నాను.

ఎంతో గౌరవించబడిన ఆస్ట్రేలియన్ భారతీయుల డ్రిబ్లింగ్ నైపుణ్యాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే వారు మళ్లీ ప్రపంచ శక్తిగా మారడానికి వారిని త్యాగం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ' మీ ప్రత్యర్థులను స్టార్లుగా మార్చడానికి ప్రయత్నించవద్దు. ఆధునిక హాకీ అనేది 3డీ మరియు వైమానిక నైపుణ్యాలకు సంబంధించినది. అదృష్టవశాత్తూ, ఈ యువకులందరూ ఈ నైపుణ్యాలను గ్రహించారు' అని చెప్పారు.

"మా ఆటగాళ్ళు వేగంగా మరియు దాడి చేయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. వారు డిఫెండర్లకు చాలా దగ్గరగా పరుగెత్తడంతో ప్రత్యర్థికి  బంతిని కోల్పోతారు. అది వినాశకరమైన ప్రభావంతో ఎదురుదాడి చేయడానికి మరొక వైపు అనుమతిస్తుంది' అని డేవిడ్ చెప్పారు.

కేఐవైజీలో ఒడిశా బాలుర జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు మరియు  బాలికల జట్టు హర్యానాతో ఫైనల్‌లో ఢీకొనాల్సి ఉంది.


 

****



(Release ID: 1833072) Visitor Counter : 125