ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్ లో జరిగిన బస్సు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన – ప్రధానమంత్రి
పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుండి ఎక్స్-గ్రేషియా – ప్రకటన
Posted On:
05 JUN 2022 9:23PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి సమీప బంధువులకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్) నుండి ప్రధానమంత్రి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం లో ట్వీట్ చేస్తూ, “ఉత్తరాఖండ్లో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం. ఇందులో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి, నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక పరిపాలన అక్కడికక్కడే సాధ్యమైన అన్ని సహాయాల్లో నిమగ్నమై ఉంది: ప్రధానమంత్రి @ నరేంద్రమోదీ"
“ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున, పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుంచి ప్రధానమంత్రి ఎక్స్గ్రేషియా ప్రకటించారు." అని పేర్కొంది.
****
DS/ST