మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

అధ్యాపక అభివృద్ధికి దేశ వ్యాప్త ఎకో సిస్ట‌మ్‌ ఏర్పాటు చేసేలా "మాల్వియా మిషన్‌"కు పిలుపునిచ్చిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 17 MAY 2022 4:44PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఉన్నత విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు/అధ్యాపకుల సామర్థ్యాన్ని పెంపొందించే సంస్థాగత యంత్రాంగం గురించి సమీక్షించారు. ఉపాధ్యాయ విద్య/ అధ్యాపకుల అభివృద్ధికి దేశవ్యాప్తంగా ఎనేబుల్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు మంత్రి ప్రధాన్ "మాల్వియా మిషన్" ఆలోచనతో ముందుకు వచ్చారు. 21వ శతాబ్దపు భారత దేశంలోని సవాళ్లకు అనుగుణంగా అధ్యాపకుల నైపుణ్యాన్ని పెంచడానికి బహుళ-కోణాల‌లోని విధానాన్ని తప్పనిసరిగా అవలంబించాలని ఆయన అన్నారు. ఉపాధ్యాయ విద్యపై జాతీయ విద్యా విధానం-2020 దృష్టిని ప్రస్తావిస్తూ, భారతీయ విలువలు, భాషలు, విజ్ఞానం, నీతి, సంప్రదాయాలపై దృష్టి సారించి ఉపాధ్యాయ విద్య పట్ల బహుళ క్రమశిక్షణా విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.
                                                                       

***



(Release ID: 1826199) Visitor Counter : 137