ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

179.91 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 18.18 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.71%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,614

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 40,559

వారపు పాజిటివిటీ రేటు 0.52%

Posted On: 12 MAR 2022 10:28AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 18.18 లక్షలకు పైగా ( 18,18,511 ) డోసులతో కలిపి, 179.91 కోట్ల ( 1,79,91,57,486 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,10,32,993 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,02,528

రెండో డోసు

99,83,044

ముందు జాగ్రత్త డోసు

42,99,668

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,11,281

రెండో డోసు

1,74,74,281

ముందు జాగ్రత్త డోసు

65,26,610

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,57,96,876

రెండో డోసు

3,33,42,579

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,31,82,397

రెండో డోసు

45,42,13,529

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,25,01,441

రెండో డోసు

18,24,75,997

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,65,74,331

రెండో డోసు

11,36,47,733

ముందు జాగ్రత్త డోసు

1,03,25,191

ముందు జాగ్రత్త డోసులు

2,11,51,469

మొత్తం డోసులు

1,79,91,57,486

 

గత 24 గంటల్లో 5,185 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,31,513 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది.

గత 24 గంటల్లో 3,614 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 40,559. ఇది మొత్తం కేసుల్లో 0.09 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 8,21,122 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 77.77 కోట్లకు పైగా ( 77,77,58,414 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.52 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1805446) Visitor Counter : 156