భారత ఎన్నికల సంఘం

విజయ ఊరేగింపులకు సంబంధించిన మార్గదర్శకాలు

Posted On: 10 MAR 2022 12:45PM by PIB Hyderabad

భారత ఎన్నికల సంఘం గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ శాసనసభలకు 8 జనవరి 2022న సాధారణ ఎన్నికలను ప్రకటించింది. ఎన్నికల ప్రకటనతో పాటు, కోవిడ్ కాలంలో విజయోత్సవ ఊరేగింపులతో సహా ఎన్నికల యొక్క వివిధ అంశాలను నియంత్రించడానికి కమిషన్ సవరించిన విస్తృత మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తాజా ఎన్నికల సమయంలో కోవిడ్ పరిస్థితి మెరుగుపడినందున, కమిషన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను క్రమంగా సడలించింది. ఈ ఎన్నిక‌లు జరుగిన‌ రాష్ట్రాల్లో కోవిడ్‌-19 యొక్క ప్రస్తుత స్థితిని వీక్షిస్తూ, కౌంటింగ్ సమయంలో మరియు తర్వాత విజయ ఊరేగింపులపై మార్గదర్శకాలను సడలించాలని కమిషన్ నిర్ణయించింది. విజయోత్సవ ఊరేగింపులపై నిషేధాన్ని ఉపసంహరించుకుంది. అయితే ఈ సడలింపు ఎస్‌డీఎంఏ యొక్క ప్రస్తుత సూచనలకు మరియు సంబంధిత జిల్లా అధికారులు విధించిన నివారణ చర్యలకు లోబడి ఉంటుంది.
                                                                                     

****



(Release ID: 1804888) Visitor Counter : 158