రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

దేశంలోని నాలుగు లక్షల సాధారణ సేవా కేంద్రాలలో స్పర్ష్ కింద పెన్షన్ సేవలను అందించడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ

Posted On: 24 FEB 2022 2:00PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్ల (సిఎస్ సి) లో సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ (రక్ష) {ఎస్ పిఎఆర్ ఎస్ హెచ్} కింద పెన్షన్ సేవలను అందించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రత్యేక ప్రయోజన విభాగం(ఎస్ పివి) అయిన సి ఎస్ సి ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ తో రక్షణ మంత్రిత్వ శాఖ (డిఎడి) ఒక అవగాహన ఒప్పందం పై ఎమ్ఒయుపై సంతకం చేసింది.

ఈ ఎమ్ఒయుపై కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (సిడిఎ) -పెన్షన్లు శ్రీ షామ్ దేవ్ , సిఎస్ సి ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ సిఇఒ శ్రీ సంజయ్ కుమార్ రాకేష్ ఫిబ్రవరి 24, 2022న న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ సమక్షంలో సంతకం చేశారు.

 

ఈ ఎమ్ఒయు పెన్షనర్ లకు, ప్రత్యేకంగా దేశంలోని మారుమూల ప్రాంతాలలో నివసించే వారికి, ఎస్ పి ఎఆర్ ఎస్ హెచ్ (స్పర్శ్) కు లాగిన్ అయ్యే మార్గాలు లేదా సాంకేతికత లేని వారికి చివరి మార్గ అనుసంధానాన్ని కల్పిస్తుంది.ఈ పెన్షనర్ ల కోసం సర్వీస్ సెంటర్లు ఎస్ పిఎఆర్ ఎస్ హెచ్ కోసం ఇంటర్ ఫేస్ గా మారతాయి.  ప్రొఫైల్ అప్ డేట్ అభ్యర్థనలను నిర్వహించడానికి, ఫిర్యాదులను నమోదు చేయడానికి , పరిష్కార, డిజిటల్ వార్షిక గుర్తింపు, పెన్షనర్ డేటా వెరిఫికేషన్ లేదా వారి నెలవారీ పెన్షన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి పెన్షనర్ లకు సమర్థవంతమైన మాధ్యమాన్ని అందిస్తాయి.

 

కోటక్ మహీంద్రా బ్యాంక్ తో కూడా ఒక ఎమ్ఒయు పై సంతకాలు జరిగాయి, దీని కింద ఆ బ్యాంక్ మాజీ సైనికులు  ఎక్కువ మంది ఉన్న ప్రాంతాల లోని 14శాఖలలో సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రాలు ప్రస్తుతం ఉన్న 161  కి పైగా డిఎడి కార్యాలయాలు , దాదాపు 800 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్ బి) శాఖల నెట్ వర్క్ ను మరింత పెంచుతాయి, ఇవి పెన్షనర్లు స్పర్ష్ ను ఉపయోగించడంలో  సహాయపడటానికి,  పని సులభతరం చేయడానికి సేవా కేంద్రాలుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కేంద్రాల సేవలను పింఛనుదారులకు ఉచితంగా అందిస్తారు, నామమాత్రపు సర్వీసు ఛార్జీలను డిపార్ట్ మెంట్ భరిస్తుంది.

 

స్పర్ష్ చొరవ ద్వారా పెన్షన్ వ్యవహారాల నిర్వహణ లో సమర్థత, ప్రతిస్పందన పారదర్శకతను కల్పించినందుకు రక్షణ కార్యదర్శి సిజిడిఎను ప్రశంసించారు, ఈ ఎమ్ఒయు జీవన సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తుందని , పెన్షన్ సంబంధిత సమస్యలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తుందని తెలిపారు. సిఎస్ సితో భాగస్వామ్యం దేశంలోని సుదూర మూలలకు డిజిటల్ గా పెన్షన్ సేవలను అందిస్తుందని, సాంకేతిక లేదా భౌగోళిక ఇబ్బందుల కారణంగా ఏ పింఛనుదారుడు కూడా తమ సరైన ప్రయోజనాలను కోల్పోకుండా చూస్తుందని ఆయన అన్నారు.

 

కార్యదర్శి (మాజీ సైనికోద్యోగుల సంక్షేమం) శ్రీ బి ఆనంద్ , ఆర్థిక సలహాదారు (రక్షణ సేవలు) శ్రీ సంజీవ్ మిట్ట ల్ , కంట్రోల ర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (సిజిడిఎ) శ్రీ రజనీష్ కుమార్ , రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

డిజిటల్ ఇండియా', 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డిబిటి)' 'కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన' అనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా రక్షణ శాఖ పెన్షనర్లకు పెన్షన్ సంబంధిత సమస్యలకు సమగ్ర పరిష్కారాన్ని అందించడమే లక్ష్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ స్పర్ష్ చొరవకు శ్రీకారం చుట్టింది. ఈ వ్యవస్థను ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (పెన్షన్స్), ప్రయాగ్ రాజ్ ద్వారా డిఎడి నిర్వహిస్తుంది. మూడు సర్వీసులకు, ఇంకా అనుబంధ సంస్థకు ఇది సేవలందిస్తుంది. ప్రారంభంలో ఈ వ్యవస్థ కొత్తగా పదవీ విరమణ చేసిన వారికి సేవ లందించింది.  తరువాత క్రమంగా ప్రస్తుత రక్షణ పెన్షనర్లను  అందరికీ సేవలందించేలా విస్తృతమయింది. ఈ వ్యవస్థ పెన్షన్ పరిశీలన, మంజూరు, బట్వాడా , సవరణ మొదలైన పెన్షన్ సైకిల్ అన్ని దశల వ్యవహారాలను నిర్వహిస్తుంది.

 

రక్షణ పెన్షనర్లను కేంద్ర స్థానం లో.ఉంచే విధంగా ఎస్ పి ఎ ఆర్ ఎస్ హెచ్ ను రూపొందించారు.వారికి తమ పెన్షన్ ఖాతాపై ఆన్ లైన్ పోర్టల్ (https://sparsh.defencepension.gov.in/) ద్వారా పూర్తి పారదర్శకమైన దృక్పథం కల్పిస్తారు.ఇది పెన్షన్ ఇచ్చింది మొదలుకొని చివరి అర్హత కలిగిన లబ్దిదారు అనంతరం పెన్షన్ నిలిపివేసే వరకు పింఛనుదారుని పూర్తి వివరాలతో  రికార్డును  నిర్వహిస్తుంది -

 

పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల (పిపిఒలు) విధానం నుంచి పెన్షన్ ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ వరకు, సరైన సమయంలో సరైన పెన్షన్ అందించాలనే నినాదంతో పెన్షన్ బట్వాడా ప్రక్రియను స్పార్ష్ ప్రాథమికంగా తిరిగి రూపొందించింది.43,370 మంది పెన్షనర్లకు కేవలం 30 రోజుల్లోగా రూ.196 కోట్లకు పైగా అదనపు గ్రాట్యుటీని విడుదల చేయడం ఎస్ పిఎఆర్ ఎస్ హెచ్ సమర్థతకు ఇటీవలి ఉదాహరణ, పాత పద్ధతి లో అయితే ఈ ప్రక్రియకు  ఆరు నెలల సుదీర్ఘ సమయం పడుతుంది.  జూన్ 2021నుండి జనవరి 2022 మధ్య పదవీ విరమణ చేసిన వారికి డిఎ పెరుగుదల ను ప్రకటించిన ఫలితంగా అదనపు గ్రాట్యుటీ చెల్లించ వలసి వచ్చింది.

ఆ విధంగా , స్పర్ష్ 'డిజిటల్ ఇండియా' స్ఫూర్తిని కలిగి ఉంది, పరిపాలన సంస్కరణ అవసరాలతో సాంకేతిక సాధనాలను సమర్థవంతంగా కలిగి ఉంది.

 

***

 



(Release ID: 1800872) Visitor Counter : 176