రైల్వే మంత్రిత్వ శాఖ

రైల్వే పరీక్షపై ఆందోళనలను పరిష్కరిస్తామని అభ్యర్థులు/ఆశావహులకు రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ హామీ

Posted On: 28 JAN 2022 6:36PM by PIB Hyderabad

"అభ్యర్థులు/ఆశావహుల సమస్యలు , ఫిర్యాదులను మేము అత్యంత సునిశితంగా పరిష్కరిస్తాము" అని రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ డిడి న్యూస్ ఇంటర్వ్యూ లో చెప్పారు.

ఆర్ ఆర్ బి ల  కేంద్రీకృత ఉపాధి నోటీసు (సిఈఎన్) నెం. 01/2019 (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు - గ్రాడ్యుయేట్ , అండర్ గ్రాడ్యుయేట్ కొరకు) కింద జరుగుతున్న నియామక పరీక్ష రెండవ దశకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసే ప్రక్రియపై కొంతమంది అభ్యర్థులు ఆందోళనలు లేవనెత్తారు - దీని ఫలితాలు 14.01.2022 న వెలువడ్డాయి.

ఈ విషయంపై శ్రీ అశ్వినీ వైష్ణవ్ డిడి న్యూస్ తో మాట్లాడుతూ, ఈ సమస్యను సున్నితంగా  పరిష్కరిస్తామని చెప్పారు. అభ్యర్థుల ఆందోళనలను పరిశీలించడానికి సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతాధికార కమిటీ ఇప్పటికే అభ్యర్థులు/ఆశావహుల విజ్ఞప్తులు అందుకోవడం ప్రారంభించింది. సీనియర్ రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్ ఆర్ బి) అధికారులు విద్యార్థుల బృందాలను కలుసుకుని వారి విజ్ఞాపన పత్రాలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు/విద్యార్థుల సమస్యలన్నీ అత్యంత సున్నితత్త్వంతో పరిష్కారమవుతాయని,  వారు ఎవరి మాటలద్వారా గందరగోళానికి/ప్రభావానికి  లోను కానవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు.

పరీక్ష  రెండవ దశకు షార్ట్ లిస్ట్ చేయాల్సిన అభ్యర్థుల సంఖ్యను వివరిస్తూ, రైల్వే పాత విధానంగా ఎన్ టి పి సి రెండవ దశ పరీక్షకు పిలవాల్సిన అభ్యర్థుల సంఖ్య ఆమోదించబడిన ఖాళీల సంఖ్యకు 10 రెట్లు మాత్రమే నని మంత్రి తెలియజేశారు. ఖాళీల సంఖ్యకు 10 రెట్లు కాల్ చేసిన ఈ సంఖ్యను సిఈఎన్ 03/2015 లో ఖాళీల సంఖ్యకు 15 రెట్లు , సిఈఎన్ 1/2019 లో ఖాళీల సంఖ్యకు 20 రెట్లు పెంచారు, తద్వారా ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష రాయడానికి అవకాశం పొందుతారు.

దీనిపై ఇంకా వివరిస్తూ, " ప్రతి కేటగిరీని చూస్తే, ప్రతి కేటగిరీలో 20 సార్లు విద్యార్థులు/అభ్యర్థులను ఎంపిక చేశారు" అని శ్రీ వైష్ణవ్ చెప్పారు. సమస్య ఏమిటంటే ఒకటి కంటే ఎక్కువ కేటగిరీలలో ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రెండవ దశలో ఐదు విభిన్న స్థాయిల సిబిటి ఉన్నందున అర్హత, మెరిట్ , ఆప్షన్ ప్రకారం ఒక అభ్యర్థిని ఒకటి కంటే ఎక్కువ స్థాయికి షార్ట్ లిస్ట్ చేయవచ్చు కనుక, ఏడు లక్షల రోల్ నెంబర్ల జాబితాల్లో ఒకటి కంటే ఎక్కువ పేర్లు కనిపిస్తాయి. ఈ సమస్యను పరిష్కరించవచ్చని, రోడ్డు ఎక్కాల్సిన , రైలుకు నిప్పు పెట్టాల్సిన అవసరం లేదని , రైల్వే మౌలిక సదుపాయాలు ప్రజల ఆస్తి అనే విషయం గుర్తుంచుకోవాలని మంత్రి అన్నారు.

 

ఈ సమస్య కు సంబంధించిన పరిష్కారం గురించి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, అభ్యర్థుల ఆందోళనలు/ అభ్యంతరాలు పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీలో నియామక ప్రక్రియలో విస్తారమైన అనుభవం ఉన్న చాలా మంది సీనియర్ అధికారులు ఉన్నారని చెప్పారు.

సంబంధిత విద్యార్థులు/అభ్యర్థుల ఫిర్యాదులు / ఆందోళనలను మూడు వారాల వ్యవధిలో అంటే 16.02.2022 నాటికి కమిటీకి సమర్పించాలని ఆయన సూచించారు. ఆ తరువాత వెంటనే తాము ఒక పరిష్కారాన్ని తీసుకువస్తామని అశ్వినీ వైష్ణవ్ భరోసా ఇచ్చారు.

 

***



(Release ID: 1793417) Visitor Counter : 181