సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

విజ‌య‌గాథ‌-ఎంటర్‌ప్రైజ్ ఉద్యమం ఉద‌యం రిజిస్ట్రేషన్‌తో ముందుకు సాగుతోంది

Posted On: 24 JAN 2022 4:59PM by PIB Hyderabad

 

         

నెక్సస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మదీమ్ జాగీర్దార్‌కు ఆర్థిక సహాయం పొందడానికి ఎంఎస్ఎంఈ శాఖ సాకారం అందించింది. ఈ  మంత్రిత్వ శాఖ మరియు #Udyam రిజిస్ట్రేషన్ పొందడం ద్వారా నెక్స‌స్ ప్ర‌యివేటు లిమిటెడ్ ప్రభుత్వ టెండర్ల ప్రయోజనాలను పొందేందుకు దోహ‌దం చేస్తోంది. అతను తన సంస్థ ద్వారా వినూత్న పిల్లల విద్యా ఉత్పత్తులు భారతదేశంలోని ప్రతి చిన్నారికి చేరేలా కృషి చేశాడు, కానీ అతని ప్రయాణంలో అతను చాలా అడ్డంకులను ఎదుర్కోవడం ప్రారంభించాడు. ఈ త‌ర‌హా అడ్డంకులను ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తొలగించింద‌ని ఆయ‌న వివ‌రించారు. “#Udyam రిజిస్ట్రేషన్ తర్వాత నేను ఈఎండీ మినహాయింపు, టర్నోవర్ మినహాయింపు మొదలైన ప్రయోజనాలను పొందగలిగాను. ఇది నా కంపెనీ ముందుకు సాగడానికి సహాయపడింది.” నెక్స‌స్ ఉత్ప‌త్తులు ఇప్పుడు మన దేశంలోని చాలా మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి.
 

***



(Release ID: 1792295) Visitor Counter : 127