సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఈ యూనిట్లు కలిసికట్టుగా పూర్తి సరఫరా గొలుసును ఏర్పాటు చేయగలవు: ఎంఎస్ఎంఈ కార్యదర్శి
Posted On:
20 JAN 2022 10:31AM by PIB Hyderabad
తయారీ వ్యయ ప్రయోజనం కారణంగా భారతీయ ఇంజనీరింగ్ ఎంఎస్ఎంఈలు గ్లోబల్ వాల్యూ చైన్లో విలీనం కావడానికి అద్భుతమైన అవకాశం ఉందని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ బి. బి. స్వైన్ అన్నారు. నిన్న ఈఈపీసీ ఇండియా నిర్వహించిన ఎంఎస్ఎంఈ కాన్క్లేవ్ ప్రారంభ సెషన్ను ఉద్దేశించి శ్రీ స్వైన్ మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈలు అధిక వృద్ధిని సాధించడానికి అవసరమైన రెండు ముఖ్యమైన ఆంశాలు క్రెడిట్ సహాయం మరియు సాంకేతికత అప్గ్రేడేషన్కు సంబంధించినవని తెలిపారు. ఎంఎస్ఎంఈల కోసం వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఇతర మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలతో కలిసి పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
"ఆత్మ నిర్భర్ ప్రకటనలతో ఎంఎస్ఎంఈలుగా నమోదు చేసుకోవడానికి యాక్సెస్ను సులభతరం చేయడం, క్రెడిట్ను సులభతరం చేయడం మరియు గ్లోబల్ టెండర్లకు సంబంధించినంతవరకు వారికి అవసరమైన రక్షణను అందించడంపై దృష్టి సారించాయి" అని స్వైన్ చెప్పారు. 1 జూలై, 2020 నుండి రిజిస్ట్రేషన్ పోర్టల్లో నమోదు చేసుకున్న 67 లక్షల ఎంఎస్ఎంఈలలో 29% ఇంజినీరింగ్ ఉత్పత్తుల తయారీలో నిమగ్నమై ఉన్న ఎంఎస్ఎంఈలు ఉన్నాయని ఆయన పాల్గొనేవారికి తెలియజేశారు. "ఎంఎస్ఎంఈ యూనిట్లు కలిసి పూర్తి సరఫరా గొలుసును ఏర్పాటు చేయగలవు మరియు ఇంటర్మీడియట్ నుండి తుది ఉత్పత్తుల వరకు వాటి విభిన్న ఉత్పత్తుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పోటీని కలిగి ఉంటాయి" అని స్వైన్ చెప్పారు.
ఈఈపీసీ ఇండియా చైర్మన్ శ్రీ మహేష్ దేశాయ్ తన స్వాగత ప్రసంగంలో మాట్లాడుతూ..ఎంఎస్ఎంఈలు గ్లోబల్ వాల్యూ చైన్లో భారతదేశపు వాటాను పెంచడానికి ఇది చాలా కీలకమైనందున సాంకేతిక రంగంలో చాలా వరకు చేరుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. "మేక్-ఇన్-ఇండియా చొరవ భారతీయ ఎంఎస్ఎంఈలకు ప్రపంచ తయారీ సంస్థలతో కలిసి పనిచేయడానికి మరియు వారి అప్గ్రేడ్ చేసిన సాంకేతికత మరియు సమర్థవంతమైన మార్కెటింగ్ పద్ధతులను యాక్సెస్ చేయడానికి విస్తారమైన అవకాశాలను తెచ్చిపెట్టిందని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత అభివృద్ధి చెందిన ప్రపంచంలోని పెద్ద సంస్థలు తయారీకి ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా భారత్ను చూస్తున్నాయని దేశాయ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఈ రంగం భారతదేశ జీడీపీకి 30% దోహదం చేస్తుందని మరియు దేశ ఎగుమతుల్లో 50% వాటాను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. "భారతదేశంలో ఎంఎస్ఎంఈ రంగం యొక్క ప్రాముఖ్యత చాలా కాలంగా గుర్తించబడింది మరియు దాని సంభావ్యత కూడా గుర్తించబడింది. జాతీయ తయారీ విధానంలో, తయారీ ఉత్పత్తి జీడీపీలో 25%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది" అని ఆయన పేర్కొన్నారు.
ఈఈపీసీ ఇండియా దాని సభ్యులలో దాదాపు 60% మంది ఎంఎస్ఎంఈ రంగం నుండి వస్తున్నారు. భారతదేశంలోని ఇంజనీరింగ్ ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. ఇంజినీరింగ్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి ఇది ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది మరియు సాంకేతిక అప్గ్రేడేషన్ కోసం వాణిజ్య శాఖ యొక్క చొరవకు అనుగుణంగా, ఇంజనీరింగ్ ఎంఎస్ఎంఈల సాంకేతిక వెనుకబాటు సమస్యను పరిష్కరించడానికి బెంగళూరు మరియు కోల్కతాలో రెండు సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసింది.
"ఇంజనీరింగ్ ఎంఎస్ఎంఈల అప్గ్రేడేషన్ కోసం మా వ్యూహాత్మక కార్యకలాపాలను కొనసాగించడం ద్వారా గ్లోబల్ వాల్యూ చైన్లో ఈ రంగం యొక్క అధిక ఏకీకరణకు మా ఉత్తమ ప్రయత్నాన్ని మేము వాగ్దానం చేస్తున్నాము మరియు ఎంఎస్ఎంఈల కోసం పూర్తిగా అంకితం చేయబడిన ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు మా లక్ష్యాన్ని సాధించడంలో మాకు సహాయపడతాయని మేము నమ్ముతున్నాము" అని శ్రీ దేశాయ్ అన్నారు.
కాన్క్లేవ్ ప్రారంభ సెషన్లో 'ఇండియన్ ఎంఎస్ఎంఈలను గ్లోబల్ వాల్యూ చైన్కు సమగ్రపరచడం' అనే ఆంశంపై నాలెడ్జ్ పేపర్ను కూడా విడుదల చేశారు. భారతదేశ వాణిజ్య పాలన దేశంలో విలువ జోడింపును ప్రోత్సహించాలని పేపర్ సూచించింది. "సాధారణ టారిఫ్ నిర్మాణం ముడి మరియు ప్రాథమిక వస్తువులపై తక్కువగా ఉండాలి, మధ్యవర్తులపై కొంచెం ఎక్కువగా ఉండాలి మరియు తుది ఉత్పత్తులపై అత్యధికంగా ఉండాలి" అని అది పేర్కొంది.
ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల నిర్మాణం రెండూ తటస్థంగా ఉండాలని మరియు సంస్థల స్వభావాల మధ్య వివక్ష చూపవద్దని సిఫార్సు చేసింది. "బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు నిజమైన ఎగుమతిదారులను గుర్తించడానికి మరియు కొలేటరల్ను తక్కువగా డిమాండ్ చేయడానికి మరింత సుముఖంగా ఉండాలి. చివరగా, ప్రభుత్వం తరపున తక్కువ జోక్యం మరియు తటస్థతకు ప్రాధాన్యత ఇవ్వడంతో విధాన చర్యలలో స్థిరత్వం అవసరం," అని కొన్ని విస్తృతమైన పాయింటర్లతో జాబితా చేయబడింది.
***
(Release ID: 1791273)
Visitor Counter : 205