నౌకారవాణా మంత్రిత్వ శాఖ

హల్దియా జెట్టీ త్వరలో ప్రారంభించబడుతుందని కేంద్ర షిప్పింగ్ మంత్రి చెప్పారు; హల్దియా నుండి పాండు వరకు పాత నదీ మార్గాన్ని పునరుద్ధరించడానికి ఈ ఇన్‌ల్యాండ్ టెర్మినల్ కోసం కాంట్రాక్ట్ ఇవ్వబడింది.

Posted On: 03 JAN 2022 9:07AM by PIB Hyderabad

హల్దియా ఇన్‌ల్యాండ్ వాటర్‌వే టెర్మినల్‌కు కాంట్రాక్టు లభించిందని ఇది ఈశాన్య ప్రాంతాలను కోల్‌కతాతో కలుపుతూ గౌహతిలోని పాండు టెర్మినల్‌కు ఎగ్జిమ్ మరియు ఇన్‌ల్యాండ్ కార్గోను పంపడానికి జెట్టీ త్వరలో పనిచేస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రకటించారు. జాతీయ జలమార్గం-2 ద్వారా ఈశాన్యం నుండి విదేశాలకు మరియు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు సులభంగా మరియు తక్కువ ఖర్చుతో సరుకు రవాణా చేయడానికి ఇది చికెన్ నెక్ మార్గానికి ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

కోల్‌కతా మరియు హల్దియా పోర్ట్‌లోని ఓడరేవు మరియు షిప్పింగ్ పరిశ్రమకు చెందిన వివిధ వాటాదారులతో మంత్రి సంభాషించారు. ప్రధాన చమురు పిఎస్‌యులు, టాటా స్టీల్ మరియు సెయిల్ వంటి ఉక్కు కంపెనీలు, టెర్మినల్ ఆపరేటర్లు, షిప్పింగ్ లైన్‌లు, బార్జ్ ఆపరేటర్లు, కస్టమ్ క్లియరింగ్ ఏజెంట్లు మరియు శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ భూ వినియోగదారులు సమావేశంలో పాల్గొన్నారు. కోల్‌కతా నౌకాశ్రయం ద్వారా సముద్ర మరియు నదీ మార్గాల కలయిక ( ఎన్‌డబ్లూ-1 మరియు ఎన్‌డబ్లూ-2)ను ఉపయోగించుకునే ఈ అపూర్వ అవకాశంలో భాగస్వాములు కావాలని మంత్రి వారందరినీ ఆహ్వానించారు.

శ్రీ సోనోవాల్ ఎన్‌డబ్లూ-1 మరియు ఎన్‌డబ్లూ-2 నిర్వహించడానికి డెప్త్ అష్యూరెన్స్ కాంట్రాక్టు ఇవ్వబడిందని మరియు లోతును హామీ ఇవ్వబడినందున బార్జ్ ఆపరేటర్లు త్వరలో ఈ జలమార్గాలను ఉపయోగించడం ప్రారంభిస్తారని తెలియజేసారు. ఈ రంగం పుంజుకునేలా బ్యారేజీలకు సులభమైన, సాఫ్ట్‌ ఫండ్స్‌ ఇచ్చేలా బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మిషన్‌ను విజయవంతం చేసేందుకు భాగస్వాములు ముందుకు వస్తామని హామీ ఇచ్చారు. వాటాదారుల సదస్సులో 40 మందికి పైగా కీలక ప్రతినిధులు పాల్గొన్నారు.


 

***



(Release ID: 1787167) Visitor Counter : 140