ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

145.44 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 25 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

98.27 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 27,553 కొత్త కేసులు నమోదు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,22,801

వారపు పాజిటివిటీ రేటు 1.35 శాతం

Posted On: 02 JAN 2022 10:05AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 25,75,225 డోసులతో కలిపి, 145.44 కోట్ల డోసులను ( 1,45,44,13,005 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,55,58,060 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,88,023

రెండో డోసు

97,16,435

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,85,833

రెండో డోసు

1,69,05,442

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

50,05,37,483

రెండో డోసు

33,52,31,221

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,47,56,093

రెండో డోసు

15,13,53,034

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,15,36,496

రెండో డోసు

9,56,02,945

మొత్తం

1,45,44,13,005

 

గత 24 గంటల్లో 9,249 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,42,84,561 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.27 శాతానికి చేరింది.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 187వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 27,553 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,22,801. ఇది మొత్తం కేసుల్లో 0.35 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 10,82,376 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 68 కోట్లకు పైగా ( 68,00,71,486) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.55 శాతంగా ఉంది.

 

****



(Release ID: 1786969) Visitor Counter : 120