గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్(పిఎమ్ఎవై-జి) ని 2021 మార్చి తరువాత నుంచి 2024 మార్చి వరకు కొనసాగించడానికిఆమోదం తెలిపిన మంత్రిమండలి


గ్రామీణ ప్రాంతాల లో అందరి కోసం గృహనిర్మాణాని కి ఇది పూచీ పడనుంది

మొత్తం 2.95 కోట్ల గృహాల నునిర్మించాలి అనేది లక్ష్యం కాగా, వాటిలో మిగిలి ఉన్న155.75 లక్షల గృహాల నిర్మాణాని కి గాను ఆర్థిక సహాయాన్ని  అందించడం జరుగుతుంది

దీని తాలూకు ఆర్థిక ప్రభావం 2,17,257 కోట్ల రూపాయలు గా ఉండగా, అందులో కేంద్రం వాటా 1,25,106 కోట్ల రూపాయలు గా ఉంది

Posted On: 08 DEC 2021 4:57PM by PIB Hyderabad

ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ (పిఎమ్ఎవై-జి) ని 2021వ సంవత్సరం మార్చి నెల తరువాత సైతం కొనసాగించడం కోసం గ్రామీణ అభివృద్ధి విభాగం తీసుకు వచ్చిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదాన్ని తెలిపింది. దీని లో భాగం గా ఈ పథకం లో మొత్తం 2.95 కోట్ల గృహాల ను నిర్మించాలనేది లక్ష్యం గా ఉండగా, 2021 మార్చి 31 నాటికి మిగిలి ఉన్నటువంటి 155.75 లక్షల ఇళ్ళ నిర్మాణాని కి ఆర్థిక సహాయాన్ని సమకూర్చవలసి ఉంది.

మంత్రివర్గం ఆమోదం తాలూకు వివరాలు ఈ కింది విధం గా ఉన్నాయి:

· పిఎమ్ఎవై-జి ని 2021 మార్చి తరువాత నుంచి 2024 వ సంవత్సరం మార్చి నెల వరకు కొనసాగించడం, దీనికి గాను మిగిలిపోయిన గృహాల ను పూర్తి చేయడం కోసం ప్రస్తుత నియమాల ప్రకారం ఆ ఇళ్ళ ను నిర్మించడం జరుగుతుంది.

· మిగిలిపోయిన 155.75 లక్షల గృహాల నిర్మాణం సంబంధిత ఆర్థిక ప్రభావం 2,17,257 కోట్ల రూపాయలుగా ఉంది (దీనిలో కేంద్రం వాటా 1,25,106 కోట్ల రూపాయలు, రాష్ట్ర వాటా 73,475 కోట్ల రూపాయలు). దీనిలో భాగం గా ఎన్ఎబిఎఆర్ డి (నాబార్డ్) కు వడ్డీ ని తిరిగి చెల్లించడం కోసం 18,676 కోట్ల రూపాయల మేరకు అదనం గా అవసరం.

· ఇబిఆర్ ను దశల వారీగా తొలగించడం మరియు యావత్తు పథకాని కి స్థూల బడ్జెటు రూపేణా సమర్ధన (జిబిఎస్) ద్వారా సర్దుబాటు చేయడం.. ఈ అంశాల లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ను సంప్రదించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.

· పరిపాలన సంబంధి నిధుల లో కేంద్రం వాటా నుంచి ఏటా అదనం గా 45 లక్షల రూపాయల ను ప్రతి ఒక్క చిన్న రాష్ట్రాని కి విడుదల చేయవలసి ఉంటుంది (2 శాతం మొత్తం పరిపాలన నిధుల లో 0.3 శాతం) ఆ చిన్న రాష్ట్రాలు ఏవేవంటే.. హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గోవా, పంజాబ్, ఉత్తారఖండ్ లతో పాటు, అసమ్ మరియు త్రిపుర లు మినహా ఈశాన్య రాష్ట్రాలు, అలాగే జమ్ము, కశ్మీర్ లు మినహా అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు.

· ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ యూనిట్ (పిఎమ్ యు) మరియు నేశనల్ టెక్నికల్ సపోర్ట్ ఏజెన్సీ (ఎన్ టిఎస్ఎ) లను 2023-24 ఆర్థిక సంవత్సరం కొనసాగించడం.

లాభాలు:

ఈ పథకాన్ని 2024 వ సంవత్సరం మార్చి వరకు కొనసాగించడం అనేది పిఎమ్ఎవై-జి లో భాగం గా లక్ష్యం గా నిర్దేశించుకున్న 2.95 కోట్ల గృహాల లో మిగిలిపోయిన 155.75 లక్షల కుటుంబాల కు కనీస సౌకర్యాల తో కూడిన పక్కా ఇళ్ళ నిర్మాణాని కి గాను సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల లో ‘‘అందరికీ గృహ వసతి కల్పన’’ అనే లక్ష్యాన్ని సాధించడం వీలవుతుంది

2021 సంవత్సరం నవంబర్ 29వ తేదీ నాటికి మొత్తం లక్ష్యం అయినటువంటి 2.95 కోట్ల గృహాల లో నుంచి 1.65 కోట్ల పిఎమ్ఎవై-జి గృహాల ను నిర్మించడం జరిగింది. 2.02 కోట్ల గృహాల ను 2022 వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ గా పెట్టుకొన్న తుది గడువు కల్లా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ కారణం గా 2.95 కోట్ల గృహాల మొత్తం లక్ష్యాన్ని సాధించాలి అంటే గనుక ఈ పథకాన్ని 2024 మార్చి నెల వరకు కొనసాగించవలసిన అవసరం ఉంది.

 

***



(Release ID: 1779421) Visitor Counter : 142