కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఈపిఎఫ్ఓ ప్రధాన నిర్ణాయక కేంద్ర మండలి 229వ సమావేశంలో కీలక నిర్ణయాలు

Posted On: 20 NOV 2021 3:00PM by PIB Hyderabad

ఈపిఎఫ్ఓ ప్రధాన నిర్ణాయక కేంద్ర మండలి 229వ సమావేశం కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి  భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి, మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ భరత్వాల్,  కేంద్ర పిఎఫ్ కమీషనర్ శ్రీ ముఖ్మీత్ ఎస్. భాటియా పాల్గొన్నారు. 

 

 సెంట్రల్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  

  • ఉద్యోగులు, యజమానులతో పాటు ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన నాలుగు సబ్‌కమిటీలను ఏర్పాటు చేయాలన్న చైర్మన్ సూచనను బోర్డు స్వాగతించి ఆమోదించింది. ఎస్టాబ్లిష్‌మెంట్ సంబంధిత విషయాలపై రెండు కమిటీలు, సామాజిక భద్రతా కోడ్ భవిష్యత్తు అమలుకు రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి నేతృత్వం వహిస్తారు. డిజిటల్ కెపాసిటీ బిల్డింగ్ మరియు పెన్షన్ సంబంధిత సమస్యలపై మిగిలిన రెండు కమిటీలకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తారు.
  • 2020-21 సంవత్సరానికి ఈపిఎఫ్ఓ పనితీరుపై 68వ వార్షిక నివేదిక ముసాయిదా ఆమోదించారు. దానిని కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంటు ముందు ఉంచాలని సిఫార్సు చేశారు.  
  • సి-డాక్ ద్వారా కేంద్రీకృత ఐటీ-ప్రారంభించబడిన వ్యవస్థల అభివృద్ధికి ఆమోదం లభించింది. దీని తర్వాత, ఫీల్డ్ ఫంక్షనాలిటీలు దశలవారీగా సెంట్రల్ డేటాబేస్‌పై కదులుతాయి, ఇది సున్నితమైన కార్యకలాపాలు, మెరుగైన సర్వీస్ డెలివరీని అనుమతిస్తుంది. కేంద్రీకృత వ్యవస్థ ఏదైనా సభ్యుని అన్ని పిఎఫ్ ఖాతాల డీ-డూప్లికేషన్ & విలీనాన్ని సులభతరం చేస్తుంది. ఉద్యోగం మారినప్పుడు ఖాతా బదిలీ అవసరాన్ని ఇది తొలగిస్తుంది. 
  • కేంద్ర ప్రభుత్వం ద్వారా నోటిఫై అయిన పెట్టుబడి నమూనాలో చేర్చిన అటువంటి అన్ని ఆస్తి తరగతులలో పెట్టుబడి పెట్టడానికి, సందర్భానుసారంగా, పెట్టుబడి ఎంపికలపై నిర్ణయం తీసుకునేందుకు ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ & ఆడిట్ కమిటీ (ఎఫ్ఐఏసి)కి అధికారం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.  

సమావేశంలో సీబీటీ ఛైర్మన్ 'కోవిడ్‌కు ప్రతిస్పందన - 2.0' అనే పేరుతో ఒక బుక్‌లెట్‌ను విడుదల చేశారు. కోవిడ్-19 మహమ్మారి కష్ట సమయంలో తన వాటాదారులకు నిరంతరాయంగా సేవలను ఆవిష్కరించడానికి, అందించడానికి ఈపిఎఫ్ఓ సంసిద్ధతను వివరించే ప్రయత్నం ఈ బుక్‌లెట్. ఈ బుక్‌లెట్ సిరీస్‌లో రెండవది, మొదటి వెర్షన్ మార్చి 2021లో శ్రీనగర్‌లో జరిగిన 228వ సీబీటీ సమావేశంలో విడుదల చేశారు.

 

 

         సీబీటీ ఛైర్మన్ 'నిర్బాద్: అడ్డంకులు లేని సర్వీస్ డెలివరీ' పేరుతో మరో బుక్‌లెట్‌ను విడుదల చేసింది. ఈ బుక్‌లెట్ గత మూడు సంవత్సరాలుగా 'ఈపిఎఫ్ఓ నుండి ఈ-ఈపిఎఫ్ఓ కి..  విజయవంతమైన డిజిటల్ రూపాంతరం కోసం  ఈపిఎఫ్ఓ  ద్వారా తీసుకున్న కార్యక్రమాలు మరియు అనుసరించిన వ్యూహాల సంకలనం. ఈ ప్రయత్నాలు  ఈపిఎఫ్ఓ డిజిటల్ ఇంటరాక్టింగ్ పేపర్‌లెస్ ఆర్గనైజేషన్ వైపు వెళ్లడానికి వీలు కల్పించాయి, తద్వారా దాని వాటాదారులందరికీ జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచాయి.  

 

 

        ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈపీఎఫ్‌వోలకు చెందిన  ,ప్రతినిధులు యజమానులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

 

 

***



(Release ID: 1773565) Visitor Counter : 198