వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

కేఎంఎస్ 2021-22లో వరి సేకరణ ద్వారా దాదాపు 11.57 లక్షల మంది రైతులు లబ్ది


- రైతులకు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర రూపంలో రూ.41,066.80 కోట్ల సొమ్ము చేరిక‌

- 14 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల‌లో సజావుగా సాగుతున్నవరి సేకరణ

Posted On: 09 NOV 2021 2:02PM by PIB Hyderabad

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌ (కేఎంఎస్) - 2021-22లో  08.11.2021వ తేదీ వరకు 209.52 ఎల్ఎంటీల‌ వరిని సేకరించింది. వ‌రి పండించే రాష్ట్రాలైన  ఛండీగఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు/యుటీల‌లో ఈ వ‌రి సేక‌ర‌ణ జ‌రిగింది.  దీని ఫలితంగా దాదాపు 11.57 లక్షల మంది రైతులు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర విలువతో రూ. 41,066.80 కోట్ల మేర ల‌బ్ధిపొందారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS) 2021-22లో రైతుల నుండి MSP వద్ద వరి సేకరణ సజావుగా సాగుతోంది, ఇది మునుపటి సంవత్సరాలలో జరిగింది.

***

 



(Release ID: 1770335) Visitor Counter : 143