ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భారతీయ సాంకేతికవ్యవస్థ వృద్ధికి గతిశక్తిని అందిస్తుంది: ఎంఓఎస్‌ ఎంఈఐటివై శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 27 OCT 2021 4:16PM by PIB Hyderabad

 

"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భారతీయ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి ఒక గతిశక్తిని కలిగిస్తుంది" అని 5వ అసోచామ్ కాన్ఫరెన్స్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ రిసైలెంట్ ఇంటెలిజెన్స్‌లో భారత ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటివై) సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (అసోచామ్‌) ద్వారా ఈ సదస్సు వర్చువల్ మోడ్ ద్వారా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొందరికి పెద్ద వ్యాపారం కావచ్చు, అయితే భారత ప్రభుత్వానికి, పాలనా డెలివరీ, వ్యవసాయ కార్యక్రమాలు, రక్షణ, భద్రతను మెరుగుపరచడానికి ఇప్పటికే ఉన్న స్టాక్‌లపై ఏఐ- అల్గారిథమ్‌లు, లేయర్‌లను ఉపయోగించడం అని అర్థం. మరియు ఇంటెలిజెన్స్ సంబంధిత కార్యక్రమాలు, రాబడి/పన్ను వసూళ్లు అలాగే న్యాయ మరియు చట్టానికి సంబంధించిన కార్యక్రమాల్లో భాగమవుతుంది.ఏఐ పట్ల ప్రభుత్వ విధానాన్ని పంచుకుంటూ, "మేము ఏఐని సృష్టిస్తాము. అందులో రిస్క్ మేనేజ్‌మెంట్ & నైతిక వినియోగం యొక్క గుణాత్మక అంశాలు అంతర్నిర్మితం " అని తెలిపారు.

భారతదేశంలో ఏఐ వృద్ధిలో అద్భుతమైన వేగాన్ని సృష్టించే మూడు ప్రధాన అంశాలను కూడా శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ హైలైట్ చేశారు. మొదట, గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ప్రోగ్రామ్‌భారత్‌నెట్ గ్రామీణ కుటుంబాలను ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నందున భారతదేశం త్వరలో అతిపెద్ద అనుసంధానిత దేశంగా అవతరించడం గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం 800 మిలియన్ల మంది భారతీయులు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 100 కోట్లు దాటుతుందని అంచనా. రెండవది, డిజిటల్ ఇండియా కార్యక్రమం. ఇప్పటికే పబ్లిక్ సర్వీసెస్, ఫిన్‌టెక్, హెల్త్ & ఎడ్యుకేషన్ మొదలైన వాటిలో ఆవిష్కరణలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపింది మరియు మూడవది, ప్రభుత్వం మరియు మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క వేగవంతమైన డిజిటలైజేషన్ దేశంలో డిజిటల్ స్వీకరణ రేటును పెంచుతుంది.

అవకాశాలను వాస్తవంగా మార్చడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క చురుకైన విధానాన్ని కూడా  శ్రీ రాజీవ్ చంద్రశేఖర్  హైలైట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతికతతో నడిచే టీకా కార్యక్రమం యొక్క విజయాన్ని ఉదహరిస్తూ " భారతదేశం సామర్థ్యాన్ని గుర్తించేలా చేయడానికి అనేక దశాబ్దాలుగా బహుళ కథనాలు నిర్మించబడ్డాయి. అయితే, గత 7 సంవత్సరాలుగా నిర్ణయాత్మక నాయకత్వం మరియు చురుకైన విధానాల కలయిక సంభావ్యతను వాస్తవంగా ఎలా మార్చగలదో మేము చూశాము." అని తెలిపారు.

"2021లో మా ఆశయాలు 2014లో ఉన్నదానికంటే చాలా ఎక్కువ. ఈ ఆశయాలపై మరియు రాబోయే రోడ్ మ్యాప్‌పై మాకు పూర్తి స్పష్టత ఉంది. 1 ట్రిలియన్ డాలర్ డిజిటల్ ఎకానమీ లక్ష్య సాధన మన మనస్సులో స్పష్టంగా ఉంది "అంటూ శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తన ప్రసంగం ముగించారు.

***



(Release ID: 1767035) Visitor Counter : 161