ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 12 OCT 2021 9:24AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 95.89 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 14,313 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది 224 రోజుల కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.04% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 26,579 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,33,20,057 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.63% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,14,900. ఇది 212 రోజుల కనిష్ట స్థాయి.

వారపు పాజిటివిటీ రేటు (1.48%) గత 109 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.21%) గత 43 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 58.50 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****



(Release ID: 1763204) Visitor Counter : 164