ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
09 OCT 2021 9:08AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 93.99 కోట్ల డోసులను అందించారు.
గత 24 గంటల్లో 19,740 కొత్త కేసులు నమోదయ్యాయి.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.70% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,36,643. ఇది 206 రోజుల కనిష్ట స్థాయి.
రికవరీ రేటు 97.98% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.
గత 24 గంటల్లో 23,070 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,32,48,291 కు పెరిగింది.
వారపు పాజిటివిటీ రేటు (1.62%) గత 106 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.
రోజువారీ పాజిటివిటీ రేటు (1.56%) గత 40 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 58.13 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1762462)
Visitor Counter : 158