రక్షణ మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలో బిఎన్ెఎస్ సొముద్ర అవిజాన్పై 1971 యుద్ధవీరులను సత్కరించిన బాంగ్లాదేశ్ హైకమిషనర్
Posted On:
06 OCT 2021 1:54PM by PIB Hyderabad
బాంగ్లాదేశ్ జాతిపిత, బంగబంధు షేక్ ముజిబూర్ రెహ్మాన్ జయంతి శతాబ్దోత్సవాలను పురస్కరించుకుని, బాంగ్లాదేశ్ హై కమిషనర్ హిజ్ ఎక్సలెన్సీ మహమ్మద్ ఇమ్రాన్ 10మంది భారతీయ నావికాదళ యుద్ధ వీరులను విశాఖపట్నంలో బిఎన్ఎస్ సొముద్ర అవిజాన్ పై నిర్వహించిన 05 అక్టోబర్, 2021న సత్కరించారు. బాంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో జరిగిన యుద్ధంలో వారి సేవలను గుర్తిస్తూ, ఈ సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఈస్టర్న్ ఫ్లీట్, విఎస్ఎం రేర్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఎన్ఎం, విఎస్ఎం సిఎస్ఒ (ఆప్స్) రేర్ అడ్మిరల్ జ్యోతిన్ రైనా, ఇఎన్సికి చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
![](https://ci6.googleusercontent.com/proxy/Thni0XbYPQXPbugoGfcIG1OGKKf5y3Bt5JVeH7FFH9CKLYKfWJPuCV7INeb7w_-GFXpHyCltrAS-45fOT5e-My9U9C5ZVIb95v6rbOFHG3Xi6P6I=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/4Z7WL.jpg)
![](https://ci5.googleusercontent.com/proxy/4amH51X01qV46S94hvM-urRVgdcyLmMzmYqRjtJVEgr6EgzO2jp9GOg3LZk7fL1QPUjzi-GVJT-LKBB1y9cZEBPg3N26tSnWCikVfGP2BQfYfeJj=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/6HG6H.jpg)
***
(Release ID: 1761400)
Visitor Counter : 170