ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
81.85 కోట్ల డోసులను దాటిన భారతదేశ కొవిడ్-19 టీకా కార్యక్రమం
97.75 శాతానికి చేరిన రికవరీ రేటు
గత 24 గంటల్లో 26,115 కొత్త కేసులు నమోదు
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (3,09,575) 0.92 శాతం
వారపు పాజిటివిటీ రేటు (2.08 శాతం) గత 88 రోజులుగా 3 శాతం కంటే తక్కువ
Posted On:
21 SEP 2021 9:53AM by PIB Hyderabad
దేశంలో కొవిడ్-19 టీకా కార్యక్రమం నిన్నటితో 81.85 కోట్ల డోసులను దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 96,46,778 డోసులతో కలిపి, మొత్తంగా 81.85 కోట్ల డోసులను (81,85,13,827) టీకా కార్యక్రమం అధిగమించింది. 80,35,135 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
1,03,69,386
|
రెండో డోసు
|
87,50,107
|
ఫ్రంట్లైన్ వర్కర్లు
|
మొదటి డోసు
|
1,83,46,016
|
రెండో డోసు
|
1,45,66,593
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
33,12,97,757
|
రెండో డోసు
|
6,26,66,347
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
15,20,67,152
|
రెండో డోసు
|
7,00,70,609
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
9,74,87,849
|
రెండో డోసు
|
5,28,92,011
|
మొత్తం
|
81,85,13,827
|
గత 24 గంటల్లో 34,469 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,27,49,574 కు పెరిగింది.
దేశవ్యాప్త రికవరీ రేటు 97.75 శాతానికి చేరింది.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 86వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 26,115 కొత్త కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 3,09,575. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 0.92 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,13,951 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 55.50 కోట్లకుపైగా (55,50,35,717) పరీక్షలు నిర్వహించారు.
వారపు పాజిటివిటీ రేటు 2.08 శాతంగా ఉంది. గత 88 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.85 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 22 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 105 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది.

****
(Release ID: 1756686)
Visitor Counter : 209