ఉక్కు మంత్రిత్వ శాఖ

'ఆజాది కా అమృత్ మహోత్సవం' నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ఇంజినీర్స్‌డే వేడుక‌ల్లో టెక్ క్వెస్ట్ క్విజ్‌

Posted On: 17 SEP 2021 12:08PM by PIB Hyderabad

'ఆజాది కా అమృత్ మహోత్సవం' జ‌రుపుకుంటుండ‌డం, ప్ర‌ముఖ ఇంజినీర్ డాక్టర్ ఎం విశ్వేశ్వరయ్య 162 వ జన్మదినాన్ని పురస్కరించుకుని, సెయిల్-భిలాయ్ స్టీల్ ప్లాంట్  మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్‌డీ) విభాగం ద్వారా హెచ్ఆర్‌డీసీలో 'టెక్_క్వెస్ట్ 1.0' అనే ప్రత్యేకమైన క్విజ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది. ఈ కార్య‌క్ర‌మంలొ  ఆడియో- విజువల్ క్విజ్, టెక్నాలజీ మ‌రియు ఇంజనీరింగ్ విష‌యాల‌కు అంకితం చేయబడింది, రాత అర్హత రౌండ్‌లో 30 ఇద్దరు సభ్యుల జట్లు పాల్గొన్నాయి, అందులో ఆరు జట్లు ఫైనల్‌కు చేరాయి. ఈ క్విజ్ టెక్నాలజీ మరియు ఇంజినీరింగ్‌పై ఆసక్తికరమైన రీతిలో  త‌గు జ్ఞానాన్ని పంచుకోవడానికి అటువంటి కార్యక్రమం నిర్వహిస్తే మేల‌ని ఈడీ (పీ అండ్ ఏ)  శ్రీ ఎస్‌.కె. దూబే వ్యక్తం చేసిన ఆలోచనకు వాస్త‌వ‌రూప‌క‌త‌గా ఈ క్విజ్ నిర్వ‌హించ‌డం జ‌రిగింది. 

 

https://lh4.googleusercontent.com/CC6EhXqYWxOOYCun9d5-kEpsUUcdzQcjnbz8GuiQYUD9-5nAofk9-d__T-V-jvO-gRAfb-M_bM5RPi0DyHaL0OmUgCpdOIHMqiQCbrC_MdSxPNipJRJcAg65tzFE5w=s0

***



(Release ID: 1755792) Visitor Counter : 226