ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 51.90 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ గత 24 గంటల్లో 41 లక్షలకు పైగా టీకాలు

అత్యధికంగా 97.45% చేరిన కోలుకున్నవారి శాతం
గత 24 గంటల్లో 38,353 కొత్త కోవిడ్ కేసులు
ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 3,86,351; 140 రోజుల్లో అత్యల్పం

మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్నవి 1. 21%
రోజువారీ పాజిటివిటీ 2.16%; 16 రోజులుగా 3% లోపే

Posted On: 11 AUG 2021 10:24AM by PIB Hyderabad

భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 51.90 కోట్లు దాటింది. 58,79,068  శిబిరాల ద్వారా మొత్తం 51,90,80,524 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది. గత 24 గంటలలో 41,38,646 టీకాలిచ్చారు.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి:       

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,03,38,727

రెండో డోస్

80,17,291

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,82,42,071

రెండో డోస్

1,18,74,095

18-44 వయోవర్గం

మొదటి డోస్

18,23,88,445

రెండో డోస్

1,29,63,932

45-59 వయోవర్గం

మొదటి డోస్

11,34,11,880

రెండో డోస్

4,35,83,965

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

7,92,14,965

రెండో డోస్

3,90,45,153

మొత్తం

51,90,80,524

 

 సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు   చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి శాతం గత 24 గంటల్లో 97.54% కు చేరుకోవటం విశేషం. కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి కోలుకున్నవారి శాతం ఇదే అత్యధికం కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటి దాకా 3,12,20,981 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 40,013  మంది బాధితులు కోలుకున్నారు..

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZYQT.jpg

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  38,353  కొత్త కేసులు నమోదయ్యాయి. 45  రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది...

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0022KUE.jpg

ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో  ఉన్నవారు 3,86,351 మంది. చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.21% మాత్రమే. ఇది 2020 మార్చి తరువాత  ఇదే అత్యల్పం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003KNOV.jpg

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 17,77,962 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 48.50 కోట్లకు పైగా (48,50,56,507) అయ్యాయి.

ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.34% కాగా రోజువారీ పాజిటివిటీ  2.16%  అయింది. వరుసగా16  రోజులుగా 3% లోపు,  65 రోజులుగా ఇది 5% లోపే ఉంటోంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TDJD.jpg

 

****



(Release ID: 1744721) Visitor Counter : 186