ప్రధాన మంత్రి కార్యాలయం

అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న సందర్భం లో భారతదేశం నూతన శిఖరాల కు చేరుకొనేటట్టుచూడటానికి 130 కోట్ల మంది భారతీయులు వారి కఠోర శ్రమ ను కొనసాగిస్తారని నేనుఆశాభావం తో ఉన్నాను: ప్రధాన మంత్రి

Posted On: 02 AUG 2021 12:03PM by PIB Hyderabad

భారతదేశం తన ‘అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటున్న సందర్భం లో భారత్ నూతన శిఖరాల కు చేరుకొనేటట్టు చూడటానికి 130 కోట్ల మంది భారతీయులు వారి కఠోర శ్రమ ను కొనసాగిస్తారనే ఆశాభావం తో నేను ఉన్నాన ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

‘‘ భారతదేశం ‘అమృత్ మహోత్సవ్’ వేడుక లు ఆరంభం అవుతున్న ఆగస్టు నెల లో ప్రవేశిస్తూ ఉన్నటువంటి ప్రస్తుత తరుణం లో భారతదేశం లో ని ప్రతి ఒక్కరి ని ఉత్సాహపరచే అనేక ఘటనల ను మనం ఇప్పటికే చూసి ఉన్నాము. రెకార్డ్ స్థాయి లో టీకాల ను ఇప్పించే కార్యక్రమం చోటు చేసుకొంది. అలాగే, అధికం గా నమోదైన జిఎస్ టి సంఖ్య లు కూడా ఆర్థిక కార్యకలాపాలు శక్తిపూర్ణం గా ఉన్నాయి అనే సంకేతాన్ని అందిస్తున్నాయి.

 

ఒలింపిక్స్ లో పి.వి. సింధు తనకు దక్కవలసిన ఒక చక్కని పతకాన్ని గెలుచుకోవడం ఒక్కటే కాకుండా, పురుషుల హాకీ జట్టు, మహిళల హాకీ జట్టు ల చరిత్రాత్మక ప్రయాసల ను కూడా మనం గమనించాం. భారతదేశం తన ‘అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటూ ఉన్నటువంటి సందర్భం లో, నూతన శిఖరాల కు భారతదేశం చేరుకొనేందుకు పూచీ పడటానికి 130 కోట్ల మంది భారతీయులు వారి కఠోర శ్రమ ను కొనసాగిస్తారనే ఆశాభావం తో నేను ఉన్నాను. ’’ అని పలు ట్వీట్ ల లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Not only has PV Sindhu won a well deserved medal, but also we saw historic efforts by the men’s and women’s hockey teams at the Olympics. I’m optimistic that 130 crore Indians will continue to work hard to ensure India reaches new heights as it celebrates its Amrut Mahotsav.

— Narendra Modi (@narendramodi) August 2, 2021

 

***

DS/SH



(Release ID: 1741435) Visitor Counter : 171