ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మరణాలు : కల్పితాలు మరియు వాస్తవాలు


అన్ని కోవిడ్-19 మరణాల సరయిన నమోదుకు భారత్, డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఐసిడి-10 కోడ్స్ ఆధారంగా రూపొందించిన ఐసిఎంఆర్ మార్గదర్శకాలనే పాటిస్తోంది

శాసనం ఆధారంగా ఏర్పాటైన ధృడమైన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్ఎస్) దేశంలో జననాలు మరియు మరణాల సంస్థాగత నమోదును నిర్ధారిస్తుంది

సిఆర్ఎస్ భారత దేశంలో అనేక దశాబ్దాలుగా అమలవుతుండగా, కోవిడ్-19 మరణాల సంఖ్యలో తేడాలు రావడానికి అవకాశం లేదు

Posted On: 27 JUL 2021 3:03PM by PIB Hyderabad

భారతదేశంలో కోవిడ్ -19 రెండు వేవ్ లలో కనీసం 2.7 నుండి 3.3 మిలియన్ల కోవిడ్ -19 మరణాలు సంభవించాయని ఆరోపిస్తూ, మెడ్‌రెక్సివ్‌లో ఇటీవల అప్‌లోడ్ చేయబడిన పీర్-రివ్యూ అధ్యయనం ఆధారంగా మూడు వేర్వేరు డేటాబేస్లను ఉటంకిస్తూ 'సంవత్సరంలో కనీసం 27% అదనపు మరణాలు సంభవించాయని వేలెత్తి చూపుతూ'కొన్ని మీడియా నివేదికలు వచ్చాయి.

భారతదేశంలో కోవిడ్ మరణాల రేటు అధికారికంగా చెబుతున్న సంఖ్య కంటే 7-8 రెట్లు అధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 'ఈ అదనపు మరణాలలో ఎక్కువ భాగం కోవిడ్-19 వల్ల జరిగి ఉండవచ్చు' అని పేర్కొంది. ఇటువంటి తప్పుడు సమాచారం నివేదికలు పూర్తిగా మిధ్యాహేతు వైన.

 

కోవిడ్ డేటా నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, అన్ని కోవిడ్-19 సంబంధిత మరణాలను నమోదు చేసే బలమైన వ్యవస్థ ఇప్పటికే ఉందని స్పష్టం చేయడం జరుగుతుంది. డేటాను నిరంతరం నవీకరించే బాధ్యతను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అప్పగించారు. 

రాష్ట్రాలు / యుటిల ఈ రిపోర్టింగ్‌తో పాటు, శాసనం ఆధారిత సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్‌ఎస్) అనే బలమైన వ్యవస్థ దేశంలో అన్ని జననాలు, మరణాలు నమోదు అయ్యేలా చేస్తుంది.  సిఆర్‌ఎస్ డేటా సేకరణ, ప్రక్షాళన, సంఖ్యలను ప్రచురించడం వంటి ప్రక్రియలను అనుసరిస్తుంది, ఇది దీర్ఘకాలిక ప్రక్రియ అయినప్పటికీ, మరణాల సంఖ్య లెక్క తప్పకుండ కచ్చితంగా నమోదయ్యేలా  చూస్తుంది. విస్తరణ, కార్యాచరణ వ్యాప్తి కారణంగా, సంఖ్యలు సాధారణంగా మరుసటి సంవత్సరం ప్రచురించబడతాయి.
 

అధికారిక సమాచార మార్పిడి, బహుళ వీడియో సమావేశాల ద్వారా, కేంద్ర బృందాలను మోహరించడం ద్వారా, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం మరణాల రికార్డింగ్ కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, యుటిలకు పదేపదే సలహా ఇస్తోంది. రాష్ట్రాలు తమ ఆసుపత్రులలో సమగ్ర ఆడిట్లను నిర్వహించాలని, డేటా-ఆధారిత నిర్ణయం తీసుకోవటానికి మార్గనిర్దేశం చేసేందుకు జిల్లా, తేదీ వారీగా వివరాలతో తప్పిపోయిన ఏదైనా కేసులు లేదా మరణాలను నివేదించాలని సూచించారు.

అంతేకాకుండా, మరణాల సంఖ్యలో అస్థిరత లేదా గందరగోళాన్ని నివారించడానికి, మే 2020 నాటికి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సరైన రికార్డింగ్ కోసం 'భారతదేశంలో కోవిడ్-19 సంబంధిత మరణాలను తగిన రికార్డింగ్ కి మార్గదర్శకం' జారీ చేసింది. మరణాల కోడింగ్ కోసం డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేసిన ఐసిడి-10 సంకేతాల ప్రకారం రాష్ట్రాలు /యుటీ లు అన్ని మరణాలను నమోదు చేస్తాయి. 

రెండవ వేవ్ గరిష్ట సమయంలో, దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ వైద్య సహాయం అవసరమయ్యే కేసుల సమర్థవంతమైన క్లినికల్ నిర్వహణపై దృష్టి పెట్టింది, దీని కారణంగా కోవిడ్ మరణాల సరైన రిపోర్టింగ్, రికార్డింగ్ ఆలస్యం కావచ్చు, కాని తరువాత రాష్ట్రాలు / యుటీ లు వాటిని సక్రమంగా నమోదు చేస్తాయి. భారతదేశంలో బలమైన, శాసనం-ఆధారిత డెత్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను చూస్తే, కొన్ని సందర్భాల్లో అంటు వ్యాధి మరియు దాని నిర్వహణ సూత్రాల ప్రకారం గుర్తించబడకపోవచ్చు, కానీ మరణాలను నమోదు చేయకుండా ఉండడడానికి  అవకాశం లేదు.

కోవిడ్ మహమ్మారి వంటి తీవ్రమైన, సుదీర్ఘమైన ప్రజారోగ్య సంక్షోభం సమయంలో మరణాలలో ఎప్పుడూ కొన్ని తేడాలు ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. నమ్మకమైన వనరుల నుండి మరణాల డేటా అందుబాటులో ఉన్నప్పుడు మరణాల గురించి బాగా నిర్వహించిన పరిశోధన అధ్యయనాలు సాధారణంగా సంఘటన తర్వాత జరుగుతాయి. అటువంటి అధ్యయనాల పద్దతులు పాటించడం జరుగుతోంది. 

*****



(Release ID: 1739684) Visitor Counter : 236