ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం


ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం అందించిన టీకా డోసులు 33.63 కోట్లు

3 రోజుల్లో రాష్ట్రాలకు అందనున్న 44.90 లక్షలకు పైగా టీకా డోసులు

Posted On: 02 JUL 2021 10:39AM by PIB Hyderabad

కోవిడ్ – 19 టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయటంలోను, పరిధిని విస్తృతం చేయటంలోను కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తోంది.  సార్వత్రిక టీకాల కార్యక్రమం 2021 జూన్ 16 న ప్రారంభం కాగా అందుబాటులో ఉన్న టీకా డోసుల సంఖ్య పెరిగేకొద్దీ వాటి అందుబాటు గురించి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ముందుగానే సమాచారం అందించటం ద్వారా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగే వెసులుబాటు కల్పించింది.

 

దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం అన్ని రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు టీకామందు ఉచితంగా అందజేస్తోంది. ఈ కొత్త దశల టీకాల కోసం దేశవ్యాప్తంగా తయారీదారుల దగ్గర అందుబాటులో ఉన్న టీకామందులో 75% మేర కేంద్రప్రభుత్వమే సేకరించి రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తోంది.

 

ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 33.63 కోట్లకు పైగా (33,63,78,220) టీకా డోసులు అందజేసింది. రాష్ట్రాలకు అందించే ఉచిత టీకాలలో ఇవి భాగం. ఇందులో వృధా తో సహా రాష్టాలు వాడుకున్న టీకా డోసులు 33,73,22,514 అని ఈ ఉదయం 8 గంటలకు అందిన సమాచారం తెలియజేస్తోంది. మరో 44,90,000 డోసులు వచ్చే3  రోజులలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందుతాయి



(Release ID: 1732366) Visitor Counter : 177