రైల్వే మంత్రిత్వ శాఖ

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా 2000 ఎంటీలకు మించి ఆక్సిజన్ రవాణా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు


అస్సాంకు 80ఎంటీల ఆక్సిజన్ తో చేరిన 4వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌

దేశం వివిధ ప్రాంతాలకు 22916 ఎంటీలకు పైగా ఆక్సిజన్ రవాణా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న 334 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

15 రాష్ట్రాలకు ఉపశమనం కల్గిస్తూ 1356 ట్యాంకర్లతో ఆక్సిజన్ చేరవేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

మహారాష్ట కు 614 ఎంటీలు, ఉత్తరప్రదేశ్ కు 3797 ఎంటీ, మధ్యప్రదేశ్ కు656 ఎంటీ, ఢిల్లీకి 5557 ఎంటీ, హర్యానా కు 2089 ఎంటీ, తెలంగాణకు 389ఎంటీ, రాజస్థాన్ కు 98 ఎంటీ, కర్ణాటక కు 2440 ఎంటీ, ఉత్తరాఖండ్ కు 320 ఎంటీ, కేరళకు 118 ఎంటీ, తమిళనాడుకు 2190 ఎంటీ, ఆంధ్రప్రదేశ్ కు 2125 ఎంటీ, పంజాబ్ కు 224ఎంటీ, కేరళకు 380 ఎంటీ, తెలంగాణకు 2062 ఎంటీ, ఝార్ఖండ్ కు 38 ఎంటీ, అస్సాంకు 329ఎంటీ లకు పైగా ఆక్సిజన్ ను సరఫరా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

Posted On: 01 JUN 2021 4:14PM by PIB Hyderabad

సమస్యలు, అడ్డంకులను దాటుకుంటూ దేశం వివిధ ప్రాంతాలకు అవసరమైన ఆక్సిజన్ ను భారత రైల్వేలు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా చేరవేస్తున్నాయి. ఇప్పటివరకు భారత రైల్వేశాఖ 1357 ట్యాంకర్లలో దాదాపు 22916 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా  చేసింది.

వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ రవాణా చేయడం ద్వారా ఉపశమనం కలిగించి 334 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ ప్రయాణాన్ని పూర్తి చేశాయి. 

దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు భారీగా ఆక్సిజన్ చేరవేశాయి. ఒకో రాష్ట్రానికి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా 2000 ఎంటీలకు పైగా ఆక్సిజన్ చేరింది. 

అస్సాం రాష్ట్రానికి నాలుగో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ చేరింది. 32 ట్యాంకర్లలో 500 ఎంటీల ఆక్సిజన్ ను ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ తీసుకుని వచ్చింది. 

దేశంలో 38 రోజుల కిందట  తొలిసారిగా ఏప్రిల్ 24వ తేదీన మొదటిసారిగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ ను రైల్వేశాఖ నడిపింది. దీనిద్వారా మహారాష్ట్రకు 126 ఎంటీల ఆక్సిజన్ రవాణా అయ్యింది. 

రాష్ట్రాల నుంచి అభ్యర్ధన అందిన వెంటనే తక్కువ కాలంలో సాధ్యమైనంత ఎక్కువగా ఆక్సిజన్ ను రవాణా చేయాలని భారత రైల్వేలు లక్ష్యంగా నిర్ణయించుకుని పనిచేస్తున్నాయి. 

దేశంలో ఇంతవరకు ఉత్తరాఖండ్, కర్ణాటక,మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్,  కేరళ,ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, అస్సాం రాష్ట్రాలకు రైల్వేలు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఆక్సిజన్ రవాణా చేశాయి. 

తాజా సమాచారం మేరకు మహారాష్ట కు 614 ఎంటీలు, ఉత్తరప్రదేశ్ కు 3797 ఎంటీ, మధ్యప్రదేశ్ కు 656 ఎంటీ, ఢిల్లీకి 5557 ఎంటీహర్యానా కు 2089 ఎంటీ, తెలంగాణకు 389ఎంటీ, రాజస్థాన్ కు 98 ఎంటీ, కర్ణాటక కు 2440 ఎంటీ, ఉత్తరాఖండ్ కు 320 ఎంటీ, కేరళకు 118 ఎంటీ, తమిళనాడుకు 2190 ఎంటీ, ఆంధ్రప్రదేశ్ కు 2125 ఎంటీ, పంజాబ్ కు 224ఎంటీ, కేరళకు 380 ఎంటీ, తెలంగాణకు 2062 ఎంటీ, ఝార్ఖండ్ కు 38 ఎంటీ, అస్సాంకు 329ఎంటీ లకు పైగా ఆక్సిజన్ ను  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు రవాణా చేశాయి. 

ఇంతవరకు 15 రాష్ట్రాల్లో  39 నగరాలు/ పట్టణాలకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఆక్సిజన్ చేరింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నో,వారణాసి, కాన్పూర్, బారెయిలీ, గోరఖ్ పూర్, ఆగ్రాలకు,మధ్యప్రదేశ్ లోని సాగర్, జబల్పూర్, కాట్నే,భోపాల్ కు, మహారాష్ట్రలో సోలాపూర్,ముంబయి, పూణే,నాసిక్, నాగపూర్ లకు,  తెలంగాణాలో హైదరాబాద్, ఢిల్లీలో ఓఖ్లా,ఢిల్లీ కంటోన్మెంట్, తుగ్లకాబాద్, హర్యానాలో గురుగాం, ఫరీదాబాద్, ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు,గుంటూరు, తాడిపత్రి, విశాఖపట్నంలకు, కేరళలో ఎర్నాకులం, తమిళనాడులో తిరువల్లూర్, చెన్నై,టుటికోరన్, కోయంబత్తూరు, మధురైలకు, పంజాబ్ లో భటిందా, ఫిల్లర్ లకు, అస్సాంలో కామరూప్, ఝార్ఖండ్ లో రాంచికి ఆక్సిజన్ రవాణా అయ్యింది. 

రాష్ట్రాల అవసరాల మేరకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి రైల్వేలు వివిధ మార్గాలను సిద్ధం చేశాయి. ఎల్‌ఎంఓను తీసుకురావడానికి అవసరమైన ట్యాంకర్లను  భారత రైల్వేకు ఆయా రాష్ట్రాలు అందిస్తున్నాయి. 

భారతీయ రైల్వే పశ్చిమంలోని హపా, బరోడా, ముంద్రా మరియు తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుల్ వంటి ప్రదేశాల నుంచి  ఆక్సిజన్ ను సమగ్ర కార్యాచణతో   ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ,  ఉత్తర ప్రదేశ్ , అస్సాం రాష్ట్రాలకు రవాణా చేస్తోంది. 

ఆక్సిజన్ సాధ్యమైనంత వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా చూసేందుకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రవాణా  రైళ్లను నడపడంలో రైల్వే కొత్త ప్రమాణాలను, ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. దూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ఈ రైళ్లు ఒకోసారి 55 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి.  సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో ఆక్సిజన్ గమ్య స్థానానికి చేరుకునేలా చూడడానికి గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేసిన రైల్వేశాఖ వివిధ జోన్ల మధ్య సమన్వయం సాధిస్తూ  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లను అత్యవసర ప్రాతిపదికన నడుపుతోంది . వివిధ విభాగాలపై సిబ్బంది మార్పుల కోసం సాంకేతిక స్టాప్‌లను 1 నిమిషానికి తగ్గించారు.

ఎలాంటి అంతరాయం లేకుండా  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి తమ మార్గాలను సిద్ధం చేస్తున్న రైల్వేలు   ఇతర సరకుల రవాణాకు అంతరాయం లేకుండా చర్యలను అమలు చేస్తున్నాయి. 

ఆక్సిజన్‌ను తరలించడం చాలా క్లిష్టమైన అంశం. ఈ గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.  మరికొన్ని ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు రాత్రి తరువాత వాటి ప్రయాణాలను ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.  

 

***



(Release ID: 1723540) Visitor Counter : 167