విద్యుత్తు మంత్రిత్వ శాఖ
కొవిడ్ -19 టీకా శిబిరాన్ని నిర్వహించిన ఆర్ఇసి
నాడు పోస్టు చేయడమైనది:
13 MAY 2021 6:29PM by PIB Hyderabad
18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వివిధ పవర్ సెక్టార్ సిపిఎస్ఇల ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం అపోలో హాస్పిటల్స్ సహకారంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న సిపిఎస్ఇ ఆర్ఇసి లిమిటెడ్ టీకాలు వేసింది.

ఆరోగ్య సంరక్షణ మరియు ఫ్రంట్లైన్ కార్మికులకు కృతజ్ఞతలతో పాటు గౌరవ పూర్వకంగా అపోలో హాస్పిటల్స్ వైద్య బృందానికి ఆర్ఇసి అధికారులు కరతాళధ్వనులతో ఘన స్వాగతం పలికారు.
ఈ శిబిరంలో మొత్తం 500 మంది ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు తమ మొదటి టీకా డోసును తీసుకున్నారు. దేశ సేవలో ప్రధాన భాగస్వామిగా ఉండటానికి ఆర్ఇసి కట్టుబడి ఉంది.
ఆర్ఇసి లిమిటెడ్ గురించి: ఆర్ఇసి లిమిటెడ్ అనేది భారతదేశవ్యాప్తంగా విద్యుత్ రంగ ఫైనాన్సింగ్ మరియు అభివృద్ధిపై దృష్టి సారించిన నవరత్న ఎన్బిఎఫ్సి. 1969 లో స్థాపించబడిన ఆర్ఇసి లిమిటెడ్ తన కార్యకలాపాల విస్తీర్ణంలో యాభై ఏళ్లకు పైగా పూర్తి చేసుకుంది. ఇది రాష్ట్ర విద్యుత్ బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర / రాష్ట్ర విద్యుత్ వినియోగాలు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు, గ్రామీణ విద్యుత్ సహకార సంస్థలు మరియు ప్రైవేట్ రంగ వినియోగాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. దాని వ్యాపార కార్యకలాపాలు పూర్తి విద్యుత్ రంగ విలువ గొలుసులో ఫైనాన్సింగ్ ప్రాజెక్టులను కలిగి ఉంటాయి; వివిధ రకాల ప్రాజెక్టులలో జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు ఉన్నాయి.
***
(రిలీజ్ ఐడి: 1718399)
సందర్శకుల సూచీ సంఖ్య : : 157