రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రంగంలోకి భారత వైమానిక దళం


ఆక్సిజన్ కంటైనర్లు, అత్యవసర మందులు, వైద్య పరికరాల సరఫరాను చేపట్టిన వైమానిక దళం

Posted On: 23 APR 2021 5:26PM by PIB Hyderabad

కోవిడ్-19ని కట్టడి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేశం వివిధ ప్రాంతాలలో అవసరమైన ప్రాంతాలకు  ఆక్సిజన్ కంటైనర్లుసిలిండర్లుఅత్యవసర మందులుపరికరాలను చేర్చడానికి వైమానిక దళం తన యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. వైమానిక దళ రవాణా విమానాలుహెలికాఫ్టర్లను దీనికోసం ఉపయోగిస్తున్నారు. సి -17, సి -130 జెఐఎల్ -76, అన్ -32 , అవ్రో రవాణా విమానాలు దేశం వివిధ ప్రాంతాల నుంచి అవసరమైన ప్రాంతాలకు సిలిండర్లు అత్యవసర మందులుపరికరాలను చేరుస్తున్నాయి. అవసరమైతే వినియోగించడానికి చినూక్ మరియు మి -17 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. కొచ్చిముంబైవైజాగ్ మరియు బెంగళూరుల నుంచి వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బందిని తన విమానాల్లో వైమానిక దళం ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులకు తీసుకొని వస్తోంది. 

భారత వైమానిక దళానికి చెందిన  సి -17,  ఐఎల్ -76 విమానాలు  పెద్ద ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను వాటిని ఉపయోగిస్తున్న ప్రాంతాల్లో నుంచి వాటిలో ఆక్సిజన్ నింపడానికి సౌకర్యం వున్న ప్రాంతాలకు తీసుకుని వెళ్తున్నాయి. అత్యవసరమైన ఆక్సిజన్ ను వేగంగా సరఫరా చేయడానికి ఈ చర్య ఉపయోగపడుతోంది. దీనితో పాటు  సి -17,  ఐఎల్ -76 విమానాలు లేహ్ వద్ద అదనపు కోవిడ్ పరీక్షా సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బయో సేఫ్టీ క్యాబినెట్లు, ఆటోక్లేవ్ మెషీన్లను పెద్ద సంఖ్యలో రవాణా చేశాయి.అతి తక్కువ సమయంలో రంగంలోకి దిగడానికి హెలికాఫ్టర్లను సంసిద్ధంగా ఉంచారు. 

కొవిడ్-19 వ్యాప్తి ప్రారంభ రోజులలో కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి అవసరమైన మందులువైద్య మరియు ఇతర అవసరమైన సామాగ్రిని పంపిణీ చేయడానికి భారత వైమానిక దళం  అనేక చర్యలను అమలు చేయడంతో పాటు విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి తీసుకుని రావడానికి సహకరించింది. 

 

***



(Release ID: 1713651) Visitor Counter : 201