ప్రధాన మంత్రి కార్యాలయం

ఆగ్ రా-లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ వే లో జరిగిన ఒక ప్రమాదం లో ప్రయాణికుల మృతి పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 13 FEB 2020 2:00PM by PIB Hyderabad

ఆగ్ రా-లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ వే లో ఈ రోజు న జరిగిన ఒక ప్రమాద ఘటన లో అనేక మంది ప్రయాణికులు చనిపోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

‘‘ఆగ్ రా-లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ వే లో ఒక రోడ్డు ప్రమాద దుర్ఘటన లో పలువురు ప్రయాణికులు మరణించడం తో నేను తీవ్ర శోకార్తుడి ని అయ్యాను.  ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల సభ్యుల కు నా యొక్క తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను’’ అని ట్విటర్ లో వ్రాసిన ఒక సందేశం లో ఆయన తన మనోభావాలను వెల్లడించారు.

‘‘ఈ ప్రమాదం లో గాయపడిన వారు త్వరిత గతి న కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను’’ అని కూడా ఆయన తన సందేశం లో పేర్కొన్నారు.

***



(Release ID: 1708301) Visitor Counter : 70