వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఫార్మాస్యూటికల్ మరియు వైద్య పరికరాల రంగంపై 6 వ అంతర్జాతీయ సదస్సులో శ్రీ పియూష్ గోయల్ ప్రసంగించారు;
నాణ్యమైన పద్ధతులను అవలంబించాలని మరియు అధిక ప్రమాణాలను కొనసాగించడానికి నిబద్ధతతో భారతీయ ఔషధ మరియు ఆరోగ్య సంరక్షణ రంగానికి పిలుపు;
కోవిడ్ -19 కోసం ఔషధాలకు సమానమైన ప్రాప్యతను పొందడానికి మరిన్ని దేశాలను అనుమతించడానికి ట్రిప్స్ రద్దుకు డబ్ల్యూటిఓ వద్ద భారత్ చేసిన ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభిస్తోంది
प्रविष्टि तिथि:
25 FEB 2021 2:10PM by PIB Hyderabad
రైల్వే, వాణిజ్యం మరియు పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు భారతీయ ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగానికి నాణ్యత, సౌకర్యం మరియు ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ నిబద్ధతతో ఉత్తమ పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. ఫార్మాస్యూటికల్, వైద్య పరికరాల రంగంపై 6 వ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆయన, దేశానికి మంచి ఉత్పాదక పద్ధతులు ఉండేలా మనమందరం సమిష్టిగా చూసుకోవాలి అని అన్నారు. ఆరోగ్య రంగానికి సంబందించిన ఏ అంశమైనా ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని, ఇక్కడే పరిష్కారం దొరుకుతుందని మొత్తం ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ ప్రపంచానికి విశ్వాసం కల్పించాలి.
రెగ్యులేటరీ & మంచి ఉత్పాదక పద్ధతులు, వ్యవస్థలు మరియు ధృవపత్రాలు, ఆమోదాలు ఎల్లప్పుడూ మన స్థాయి పెరగడానికి మరియు ధరను తగ్గించడానికి సహాయపడతాయని ఆయన అన్నారు. గత కొన్నేళ్లుగా భారతదేశం ఆరోగ్య సంరక్షణలో ఒక స్వర్ణ యుగాన్ని చూస్తోందని తెలిపారు. ప్రపంచం మొత్తం భారతీయ ప్రమాణాలను పాటించాల్సిన తరువాతి దశాబ్దం, భారతదేశ దశాబ్దం అని వ్యాఖ్యానించారు.
ఈ రోజు ప్రపంచానికి సియుఆర్ఈ - 'క్యూర్' అవసరమని మంత్రి అన్నారు. రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రైజ్ ద్వారా ఖర్చుతో కూడుకున్న యూనివర్సల్ సొల్యూషన్ నుండి 'క్యూర్' వెల్లడవుతుంది. "భారతదేశం ప్రపంచాన్ని 'క్యూర్' చేయబోతోందని మనం స్వయంగా తీసుకుంటే, మెడ్-టెక్, మెడికల్ పరికరాలు, హెల్త్కేర్ ప్రొవైడర్ రంగంలో ప్రపంచ ప్రబలమైన నాయకుడిగా ఎదగడానికి మన సామర్థ్యంలో ఎటువంటి పరిమితులు లేవు. పరిశోధన మరియు సంస్థ ద్వారా ఖర్చుతో కూడుకున్న సార్వత్రిక పరిష్కారం నుండి క్యూర్ బయటకు వస్తుంది. ” అని అయన తెలిపారు.
ట్రిప్స్ కౌన్సిల్లో డబ్ల్యూటిఓ ముందు, 2020 అక్టోబర్లో ప్రవేశపెట్టిన ప్రతిపాదనలో, కోవిడ్-19 సమయంలో మాఫీ కోసం మరిన్ని దేశాలకు ఔషధాలను సమానంగా పొందటానికి వీలుగా దక్షిణాఫ్రికాతో పాటు భారతదేశం ముందంజలో ఉందని శ్రీ గోయల్ అన్నారు. మనకు ఇప్పుడు 57 మంది డబ్ల్యుటిఒ సభ్యులు మద్దతు ఇస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద హృదయాన్ని చూపించాలని డబ్ల్యూటిఓ వద్ద భారతదేశం ప్రతిపాదించిన ట్రిప్స్ మాఫీకి మద్దతు ఇవ్వాలని ఔషధ పరిశ్రమకు పిలుపునిచ్చిన ఆయన, ప్రపంచం మొత్తం మహమ్మారి నుండి చాలా వేగంగా బయటకు రావడానికి ఇది సహాయపడుతుందని అన్నారు. కొన్ని ఔషధ కంపెనీల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రయత్నిస్తున్న అభివృద్ధి చెందిన ప్రపంచాన్ని ఈ ప్రతిపాదన ఒత్తిడికి గురి చేసిందని మంత్రి చెప్పారు.
కోవిడ్ మహమ్మారి నుంచి బయటకు రావడానికి భారతదేశం తీసుకుంటున్న చర్యలు సరైన దిశలోనే ఉన్నాయని, కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడి పుంజుకోడానికి ఫార్మా పరిశ్రమ బాగానేకృషి చేస్తోందని మంత్రి అన్నారు. ఔషధ పరిశ్రమ 3 V లను అందించిందని ఆయన చెప్పారు: - వెంటిలేటర్లు - వాక్సిన్లు - V- ఆకారపు రికవరీ, మరియు ఈ మూడు V లు పరిశ్రమ బలాన్ని ప్రతిబింబిస్తాయి. "ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా, ఈ కోవిడ్ మహమ్మారిని అవకాశంగా మార్చుకుందాం, ఈ విషయంలో ఫార్మా పరిశ్రమ కంటే గొప్పగా ఎవరూ సాధించేందుకు సిద్ధంగా లేరు" అని ఆయన చెప్పారు.
***
(रिलीज़ आईडी: 1700795)
आगंतुक पटल : 215