ప్రధాన మంత్రి కార్యాలయం

‘రాష్ట్రీయ బాల పుర‌స్కార్‌, 2021’ గ్ర‌హీత‌ల‌ తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 25 JAN 2021 2:26PM by PIB Hyderabad

‘ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ (పిఎమ్ఆర్‌బిపి)’ గ్ర‌హీత‌ల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు.  ఈ సంద‌ర్భం లో మ‌హిళ‌లు & బాల‌ల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీ‌మతి స్మృతి జుబిన్ ఇరానీ కూడా హాజరయ్యారు.

ఈ సంవ‌త్స‌రం పుర‌స్కారాలను గ్రహీతలు క‌రోనా తాలూకు క‌ష్ట‌కాలం లో గెలుచుకొన్నందువ‌ల్ల ఈ పురస్కారాలు వారికి ప్ర‌త్య‌క‌మైన‌వి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  పురస్కార స్వీకర్తల తో ప్ర‌ధాన మంత్రి ముచ్చటించిన క్ర‌మం లో, ప్ర‌ధాన‌ం గా నడవడిక లో మార్పు ను ఉద్దేశించిన ‘స్వ‌చ్ఛ‌త అభియాన్’ వంటి ప్ర‌చార ఉద్య‌మాల లో బాల‌ల పాత్ర ఎంతైనా ఉంద‌ని ఆయన అంగీకరించారు.  క‌రోనా కాలం లో చేతుల‌ ను సబ్బుతో, నీళ్లతో శుభ్రం గా క‌డుక్కోవాలి అని చాటిచెప్పే ప్రచార కార్య‌క్ర‌మాల‌ లో బాల‌లు పాలుపంచుకొన్న‌ప్పుడు, ఆ ప్ర‌చార ఉద్య‌మాలు ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ లో నాటుకుపోయి స‌ఫ‌ల‌త‌ ను సాధించాయి అని ఆయ‌న అన్నారు.  ఈ సంవ‌త్స‌రం లో పుర‌స్కారాల ‌ను ప్ర‌దానం చేసిన రంగాల తాలూకు వైవిధ్యాన్ని సైతం ప్ర‌ధాన మంత్రి ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించారు.

ఒక చిన్న ఆలోచ‌న కు స‌రైన ప‌ని తోడ‌యితే ఫ‌లితాలు ఆక‌ర్ష‌ణీయం గా ఉంటాయి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  క్రియాశీలత ప‌ట్ల బాల‌లు న‌మ్మ‌కాన్ని పెంచుకోవాల‌ని, ఈ ఆలోచ‌న‌ల‌ కు, కార్యాల‌ కు మ‌ధ్య ఉన్న సంబంధం గొప్ప గొప్ప ప‌నుల‌ ను చేయ‌డానికి ప్ర‌జ‌ల‌ కు ప్రేర‌ణ‌ ను అందిస్తాయ‌ని ఆయ‌న చెప్పారు.  సాధించిన విజ‌యాల‌ తోనే బాలలు సంతృప్తి పడిపోకూడ‌దు, వారు వారి జీవితాల లో మరింత ఉత్త‌మ‌మైన ఫ‌లితాల కోసం కృషి చేస్తూనే ఉండాలి అని ప్ర‌ధాన మంత్రి సూచించారు.

బాల‌లు మూడు అంశాల‌ కు, మూడు ప్ర‌తిజ్ఞ‌ల‌ కు వారి మ‌న‌స్సు లో స్థానం ఇవ్వాలి అని ప్ర‌ధాన‌ మంత్రి కోరారు.  ఒక‌టో అంశం- నిలకడతనం తాలూకు ప్ర‌తిజ్ఞ‌; చేసే ప‌నుల‌ లో వేగం ఎంత మాత్రం త‌గ్గ‌కూడ‌దు అని ఆయ‌న సూచించారు.  రెండో అంశం- దేశం కోసం ప్ర‌తిజ్ఞ చేయ‌డం.. మ‌నం దేశం కోసం ప‌నిచేస్తే, ప్ర‌తి ఒక్క ప‌ని ని దేశం కోసం చేస్తున్నాము అని భావిస్తే, అప్పుడు ఆ ప‌ని వ్య‌క్తి కంటే గొప్ప‌ది అవుతుంది అని ఆయ‌న చెప్పారు.  మ‌నం స్వాతంత్య్రం సంపాదించుకొని 75వ సంవ‌త్స‌రం లోకి అడుగుపెడుతున్న స‌మ‌యం లో దేశానికి మనం ఏం చేయగ‌ల‌ం అన్న‌ది ఆలోచించాలి అని బాల‌ల‌ ను ప్రధాన మంత్రి కోరారు.  ఇక మూడో అంశానికి వ‌స్తే, అది విన‌మ్ర‌త తాలూకు ప్ర‌తిజ్ఞ‌.  ప్ర‌తి ఒక్క స‌ఫ‌ల‌త మ‌న‌ను మ‌రింత అణ‌కువ‌ గా ఉండేట‌ట్లు ఉత్తేజితం చేయాలి, మ‌న విన‌మ్ర‌త మ‌న సాఫ‌ల్యాన్ని మ‌న‌తో క‌ల‌సి ఒక వేడుక‌ గా జ‌రుపుకొనేందుకు ఇత‌రుల‌కు అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది అని ప్ర‌ధాన మంత్రి చెప్తూ, త‌న సంభాష‌ణ ను ముగించారు.

నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ లు, విద్యా సంబంధిత కార్య‌సాధ‌న‌ లు, క్రీడ‌ లు, క‌ళ‌ లు, సంస్కృతి, సామాజిక సేవ‌, సాహ‌సం రంగాల లో అసాధార‌ణమైన ఘ‌న కార్యాల‌ ను సాధించ‌డం తో పాటు అరుదైన సామ‌ర్ధ్యాలను ప్ర‌ద‌ర్శించిన బాల‌ల‌ కు ‘ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్’ లో భాగం గా భార‌త ప్ర‌భుత్వం బాల‌శ‌క్తి పుర‌స్కారాల‌ ను ప్ర‌దానం చేస్తూ వస్తోంది.  ఈ సంవ‌త్స‌రం  బాల‌ శ‌క్తి పుర‌స్కారాల కు చెందిన వివిధ కేట‌గిరీల లో దేశ వ్యాప్తం గా 32 మంది ద‌ర‌ఖాస్తుదారుల ను ‘ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కారాల (పిఎమ్ఆర్‌బిపి)-2021’ కు ఎంపిక చేయ‌డం జ‌రిగింది.



 

*** 



(Release ID: 1692176) Visitor Counter : 206