ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ నరేంద్ర చంచల్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 JAN 2021 3:58PM by PIB Hyderabad

శ్రీ నరేంద్ర చంచల్ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘జనాదరణ పొందిన భజన గీతాల గాయకుడు నరేంద్ర చంచల్ గారు కన్నుమూశారన్న వార్త తెలియడం తో అత్యంత దు:ఖం కలిగింది.  ఆయన భజన గీతాల ఆలాపన జగత్తు లో తన ఓజశ్శక్తిభరితం అయినటువంటి స్వరం తో ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకొన్నారు.  ఈ శోక ఘడియ లో ఆయన కుటుంబానికి, అభిమానులకు ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 


 

***


(రిలీజ్ ఐడి: 1691279) సందర్శకుల సూచీ సంఖ్య : : 107