రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
నామ్రుప్లో ఏర్పాటు చేయబోయే యూరియా ప్లాంట్పై కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అధ్యక్షతన సమావేశం
Posted On:
21 JAN 2021 3:38PM by PIB Hyderabad
నామ్రుప్లో ఏర్పాటు కానున్న 12.7 లక్షల ఎమ్ఎమ్టిపిఎ సామర్థ్యం గల యూరియా ప్లాంట్కు సంబంధించి కేంద్ర రసాయన, ఎరువుల మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి, అస్సాం ఆర్థిక మంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ, అస్సాం పరిశ్రమ, వాణిజ్య మంత్రి శ్రీ చంద్ర మోహన్ పటోవరీ, శ్రీ ఆర్కె చతుర్వేది, కార్యదర్శి (ఎరువులు), శ్రీ ధరం పాల్, అదనపు కార్యదర్శి (ఎరువులు), శ్రీ సుశీల్ చంద్ర మిశ్రా, సిఎండి (ఆయిల్), శ్రీ ఎస్. ముద్గేరికర్, సిఎండి (ఆర్సిఎఫ్), శ్రీ అసిమ్ కుమార్ ఘోష్, సిఎండి (బివిఎఫ్సిఎల్), శ్రీ నిర్లేప్ సింగ్ రాయ్, డైరెక్టర్ (ఎన్ఎఫ్ఎల్) తదితరులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధే ప్రాధాన్యత అని శ్రీ గౌడ అన్నారు. యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించటానికి ప్రధానమంత్రి నిర్దేశం మేరకు నామ్రుప్ వద్ద అత్యాధునిక సాంకేతికతో యూరియా యూనిట్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తురు. ఈ యూరియా యూనిట్ ద్వారా స్థానిక రైతుల యూరియా డిమాండ్లను తీర్చడమే కాకుండా మిగిలిన ఉత్పత్తిని దక్షిణ ఆసియాలోని పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వారి అంతర్గత ప్రక్రియను త్వరగా ముగించిన పిఎస్యు సిఎండిల పనితీరును మంత్రి ప్రశంసించారు.
నామ్రుప్ ప్రాజెక్టుకు వీలైనంత ఆర్ధిక సాయంతో పాటు అన్ని రకాల సహకారాన్ని అందించడానికి అస్సాం ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీ బిస్వాస్ తెలియజేశారు.
స్థానిక అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి నామ్రుప్- IV యూనిట్ ముఖ్యమని, అందువల్ల ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని శ్రీ తేలి అన్నారు.
అస్సాం ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందిస్తుందని శ్రీ పటోవరీ తెలిపారు. రాబోయే ప్రాజెక్ట్ కు కూడా ఆ ప్రోత్సాహకాలు పొందవచ్చని చెప్పారు.
నామ్రుప్ ప్రాజెక్టుపై తమ అంతర్గత ప్రక్రియను వేగవంతం చేయడానికి సంబంధిత పిఎస్యుల సిఎండిలు అంగీకరించారు.
ఈ ప్రాజెక్టుకు సహకరించినందుకు పాల్గొన్న వారికి / వాటాదారులకు కేంద్ర మంత్రి శ్రీ గౌడ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభమయ్యేలా చూడటం తన మంత్రిత్వ శాఖ ఉద్దేశం అని అన్నారు.
***
(Release ID: 1690944)
Visitor Counter : 127