ఆర్థిక మంత్రిత్వ శాఖ

సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల పథకం 2020-21 (సిరీస్‌-IX) - ధర ప్రకటన


Posted On: 26 DEC 2020 2:57PM by PIB Hyderabad

ఈ ఏడాది అక్టోబర్‌ 9న భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ నం. 4(4)-బి/(డబ్ల్యూ&ఎం)/2020 ప్రకారం, 2020-21 సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల అమ్మకం (సిరీస్-IX‌) ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 1వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. జనవరి 5ను సెటిల్‌మెంట్‌ తేదీగా నిర్ణయించారు. సబ్‌స్క్రిప్షన్‌ గడువులో బంగారం ధరను గ్రాముకు రూ.5,000గా నిర్ణయించారు. ఈనెల 24న రిజర్వ్‌ బ్యాంకు జారీ చేసిన పత్రికా ప్రకటనలోనూ దీనిని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని, డిజిటల్‌ పద్ధతిలో చెల్లింపులు చేసేవారికి గ్రాముకు రూ.50 చొప్పున తగ్గిస్తారు. రిజర్వ్‌ బ్యాంక్‌తో సంప్రదింపుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీరికి గోల్డ్‌ బాండ్‌ జారీ ధర గ్రాముకు రూ.4,950 చొప్పున ఉంటుంది.

***

 



(Release ID: 1683839) Visitor Counter : 269