ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

స్వదేశీ వ్యాక్సిన్ స్థితిగతులపై చర్చించిన ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతిని కలిసిన భారత్ బయోటెక్ చైర్మన్

ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాల ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతి వివరించారు

Posted On: 25 DEC 2020 3:06PM by PIB Hyderabad

భారత్ బయోటెక్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా మరియు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సుచిత్రా ఎల్లా భారత వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎం. వెంకయ్య నాయుడిని ఈ రోజు హైదరాబాద్‌లో కలిశారు.

స్వదేశీ వ్యాక్సిన్ యొక్క స్థితి మరియు భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలలో అందుబాటులో ఉంచే ప్రణాళికలపై ఈ చర్చ ప్రధానంగా సాగింది. ఈ వ్యాక్సిన్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ఈ స్వదేశీ, క్రియారహిత వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ యొక్క బిఎస్ఎల్ -3 (బయో-సేఫ్టీ లెవల్ 3) బయో కంటైనేషన్ సదుపాయంలో అభివృద్ధి చేసి తయారు చేస్తున్నారు.

ఇటీవల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భారత్ బయోటెక్‌ను సందర్శించి కోవాక్సిన్ స్థితిని సమీక్షించారు. దాని తరువాత హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కేంద్రాన్ని వివిధ దేశాల నుండి 70 మంది రాయబారులు మరియు హైకమిషనర్లు సందర్శించారు.

ఈ చర్చ సందర్భంగా దేశీయంగా ప్రపంచ స్థాయి ఉత్పత్తుల తయారీలోప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. అలాగే ఐసిఎంఆర్ మరియు భారత్ బయోటెక్ మధ్య సహకారాన్ని ప్రశంసించారు.

***



(Release ID: 1683664) Visitor Counter : 146