ఆర్థిక మంత్రిత్వ శాఖ

కెయిర్్న ఎన‌ర్జీ పిఎల్‌సి, కెయిర్న్ యుకె హోల్డింగ్ లిమిటెడ్ కేసులో మ‌ధ్య‌వ‌ర్తి నిర్ణయాన్ని అధ్య‌య‌నం చేయ‌నున్న ప్ర‌భుత్వం

Posted On: 23 DEC 2020 2:08PM by PIB Hyderabad

 భార‌త ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కెయిర్్న ఎన‌ర్జీ పిఎల్‌సి, కెయిర్్న యుకె హోల్డింగ్స్ లిమిటెడ్ అప్పీలు చేసుకున్న భార‌త్‌- యుకె ఒప్పందం కింద పెట్టుబ‌డుల ప్రోత్సాహం, ప‌రిర‌క్ష‌ణకు సంబంధించిన మ‌ధ్య‌వ‌ర్తి నిర్ణ‌యం జారీ అయిన‌ట్టు తెలుస్తోంది. 
ఈ నిర్ణ‌యాన్ని అన్ని కోణాల‌లోనూ, అన్ని అంశాల‌నూ న్యాయ‌వాదులతో సంప్ర‌దింపుల మేర‌కు జాగ్ర‌త్త‌గా ప్ర‌భుత్వం అధ్యయ‌నం చేయ‌నుంది. అటువంటి సంప్ర‌దింపుల అనంత‌రం, త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌కు సంబంధించిన నిర్ణ‌యాన్ని న్యాయ ప‌రిహారాల‌తో స‌హా  ప్ర‌త్యాయామ్నాయ‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌గిన వేదిక ముందు పెట్ట‌నుంది. 

***
 



(Release ID: 1683061) Visitor Counter : 181