కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

అక్టోబర్ 2020లో ఈపిఎఫ్ఓలో కొత్తగా 11.55 లక్షల సభ్యుల చేరిక

Posted On: 20 DEC 2020 6:37PM by PIB Hyderabad

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం​లో( ఏప్రిల్ నుంచి అక్టోబర్) ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపిఎఫ్ఓ) లో కొత్తగా 39. 33లక్షల మంది సభ్యులు చేరారు. తాజా సభ్యుల సంఖ్యతో సంస్థ గణాంకాలను విడుదల చేసింది. 2020 డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 అక్టోబర్ నెలలో సంస్థలో 11. 55 లక్షల మంది సభ్యులుగా చేరారని వెల్లడవుతున్నది. కోవిడ్-19 వ్యాప్తి తరువాత విధించిన లాక్ డౌన్ ఈపిఎఫ్ఓపై ప్రభావాన్ని చూపాయి.​ అయితే, ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడడం ప్రారంభించడం తో ఈపిఎఫ్ఓ సభ్యుల సంఖ్య పెరుగుతున్నది. 2020 ​ అక్టోబర్ నెలలో ఈపిఎఫ్ఓలో కొత్తగా ​11.​55 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. 2019 ​ అక్టోబర్ నెలలో తో పోల్చిచూస్తే ఇది ​56శాతం ఎక్కువ. ​2019 అక్టోబర్ లో 7. 39 లక్షల సభ్యత్వాలు నమోదు అయ్యాయి. దీనిని పరిశీలిస్తే కొవిడ్ రాక ముందటి పరిస్థితి నెలకొంటున్నదని చెప్పవచ్చును.

​2020 అక్టోబర్ లో 7. 15 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఇదే నెలలో దాదాపు 2. 40 లక్షల మంది ఈపిఎఫ్ఓ నుంచి తప్పుకున్నారు. ఈపిఎఫ్ఓ సభ్యత్వాన్ని రద్దు చేసుకున్న వారిలో తిరిగి 6. 80 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఈపిఎఫ్ఓ పరిధిలోకి వచ్చే సంస్థలలో కొత్తగా ఉద్యోగాలు పొందినప్పటికీ వీరు తమ పూర్వ ఖాతాలను కొనసాగిస్తున్నారు. ఖాతాలను మూసివేయకుండా వాటినే కొత్త సంస్థలకు బదిలీ ​చేసుకోవడంతో ఇది సాధ్యమవుతుంది. ​భారతదేశంలో కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో వీరు తిరిగి తమ ఉద్యోగాలలో చేరుతూ ఈపిఎఫ్ఓ ఖాతాలను పునరుద్ధరించుకుంటున్నారు.

వయస్సువారిగా సభ్యుల వివరాలను పరిశీలిస్తే ​ అక్టోబర్ నెలలో ​ ఈపిఎఫ్ఓలో​​18-25 మధ్య వయ​స్సులో ఉన్నవారుఅత్యధికంగా సభ్యులుగా చేరారు. 18-25 మధ్య వయస్సు ఉన్నవారిని తొలిసారిగా ఉపాధి పొందిన వారీగా పరిగణించవచ్చును.వీరు ఈపిఎఫ్ఓపై విశ్వాసాన్ని ఉంచుతూ సభ్యత్వం పొందారు.​ మొత్తం సభ్యత్వం పొందిన వారిలో వీరు 50% వరకు ఉన్నారు.

గణాంకాలను రాష్ట్రాలవారీగా సభ్యుల సంఖ్యను పరిశీలిస్తే మహారాష్ట్ర, తమిళనాడు,గుజరాత్, కర్ణాటక,హర్యానా రాష్ట్రాలు నూతన సభ్యుల నమోదులో ముందున్నాయి.​ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో సభ్యులుగా చేరినవారిలో ఈ రాష్ట్రాలకు చెందినవారు 53%వరకు ఉన్నారు.

పరిశ్రమలవారీగా చూస్తే " ప్రత్యేక తరగతి" ( మానవ వనరుల కల్పనా సంస్థలు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు, చిన్న కాంట్రాక్టర్లు) జాభితా కిందకి వచ్చేవారు ​ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అత్యధికంగా 60% వరకు సభ్యులుగా ఉన్నారు. భవన నిర్మాణం, వ్యాపార సంస్థలు, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ మెకానికల్, సాధారణ ఇంజనీరింగ్ రంగాలలో పనిచేస్తున్నవారు కూడా ఈపిఎఫ్ఓ సభ్యులుగా చేరుతున్నారు. దీనితో కొవిడ్ కష్టాలు తీరినట్టు భావించవచ్చును.

2020అక్టోబర్ నెలలో 2. 08 లక్షల మంది మహిళలు ఈపిఎఫ్ఓ సభ్యులుగా చేరారు. కొత్తగా ఈపిఎఫ్ఓ సభ్యత్వం వారిలో మహిళల సంఖ్య 21% ​గా ఉంది. సంఘటిత రంగానికి చెందిన ఉద్యోగులకు సామా​ ​జిక భద్రత కల్పించే విషయంలో దేశంలో ఈపిఎఫ్ఓ అగ్ర స్థానంలో ఉంది. ప్రావిడెంట్ ఫండ్, భీమా,పెన్షన్ ​ సౌకర్యాలను కలగచేస్తున్న ఈపిఎఫ్ఓ లక్షలాది మంది ఉద్యోగులగు అండగా నిలుస్తున్నది.ఈపిఎఫ్ఓ సభ్యుల వివరాలను ప్రతి నెలా నమోధు చేయడం నిరంతర ప్రక్రియగా సాగుతున్నది.

***



(Release ID: 1682334) Visitor Counter : 119