రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

'మేక్ ఇన్ ఇండియా ' కు అతిపెద్ద ప్రోత్సాహం

- దేశీయ ర‌క్ష‌ణ పరిశ్రమ నుండి రూ.27000 కోట్ల విలువైన ర‌క్ష‌ణ పరికరాలను సేకరించే ప్రతిపాదనలకు.. రక్ష‌ణ‌ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం

Posted On: 17 DEC 2020 5:25PM by PIB Hyderabad

కేంద్ర ర‌క్ష‌ణ‌ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ అధ్యక్షతన ఈ రోజు స‌మావేశ‌మైన‌
'డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్‌'‌ (డీఏసీ) 'మేక్ ఇన్ ఇండియా'‌కు అతిపెద్ద ప్రోత్సాహం ఇచ్చేలా గొప్ప నిర్ణ‌యం తీసుకుంది. దేశీయంగా భారత సైన్యం, నావికాదళం, భారత వైమానిక దళానికి అవసరమైన దాదాపు రూ.28,000 కోట్ల విలువైన వివిధ ఆయుధాలు/ వేదికలు / సామగ్రి/ వ్యవస్థల మూలధన సముపార్జన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 యొక్క కొత్త విధానంలో ఇది డీఏసీ యొక్క మొదటి సమావేశం. ఇవి బై ఇండియన్ (ఐడీడీఎం) యొక్క అత్యధిక వర్గీకరణలో మెజారిటీ ఏఓఎన్‌లతో ఆమోదించబడిన మొట్టమొదటి అంగీకారం (ఏఓఎన్ఎస్‌) ఇది. మొత్తం ఏడు ప్రతిపాదనలలో ఆరు, అంటే ఏఓఎన్‌ లు మంజూరు చేయబడిన రూ.28,000 కోట్లలో 27,000 కోట్ల రూపాయల స‌ముపార్జ‌నం భారత పరిశ్రమ నుండి "మేక్ ఇన్ ఇండియా" మరియు "ఆత్మనిర్భర్ భారత్" కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ రోజు ఆమోదించబడిన సముపార్జన ప్రతిపాదనలలో భారత వైమానిక దళం కోసం డీఆర్‌డీఓ రూపొందించిన మరియు అభివృద్ధి చేసిన వైమానిక ప్రారంభ హెచ్చరిక & నియంత్రణ(ఏఈడ‌బ్ల్యూ&సి) వ్యవస్థలు, భారత నావికా దళానికి చెందిన త‌దుప‌రి త‌రం ఆఫ్‌షోర్ గ‌స్తీ వెసెల్స్‌ మరియు భారత సైన్యంకు సంబంధించిన‌ మాడ్యులర్ వంతెనలు ఉన్నాయి.

***


(Release ID: 1681618)