రాష్ట్రప‌తి స‌చివాల‌యం

శ్రీ ప్రణబ్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి

Posted On: 11 DEC 2020 12:05PM by PIB Hyderabad

మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, రాష్ట్రపతితోపాటు రాష్ట్రపతి భవన్‌ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రణబ్‌ చిత్రపటానికి పూలు సమర్పించి, అంజలి ఘటించారు.
 

***



(Release ID: 1679970) Visitor Counter : 147