మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాసిన ‘మనవ్తా కే ప్రణేతా: మహర్షి అరవింద్’ పుస్తకాన్ని రాష్ట్రపతి విడుదల చేసినట్లు వచ్చిన మీడియా వార్తలకు సంబంధించి వివరణ


Posted On: 09 DEC 2020 2:23PM by PIB Hyderabad

2020 డిసెంబర్ 5 న రాష్ట్రపతి భవన్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' రాసిన 'మనవ్తా కే ప్రణేతా: మహర్షి అరవింద్' అనే పుస్తకాన్ని రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ 'విడుదల' చేసినట్లు కొన్ని విభాగాలలో మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ విషయంలో పైన పేర్కొన్న పుస్తకాన్ని రాష్ట్రపతి విడుదల చేయలేదని ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ పుస్తకం మొదటి కాపీని రాష్ట్రపతికి సమర్పించారు.

*****



(Release ID: 1679417) Visitor Counter : 141