రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సాయుధ దళాల దినోత్సవం సిఎస్ఆర్ కాన్క్లేవ్: ఎఎఫ్‌ఎఫ్‌డి ఫండ్‌కు ఉదారంగా సహకరించడం కొనసాగించాలని రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ పరిశ్రమను కోరారు.

Posted On: 04 DEC 2020 6:38PM by PIB Hyderabad

సాయుధ దళాల దినోత్సవ సిఎస్ఆర్ కాంక్లేవ్ యొక్క రెండవ ఎడిషన్  డిసెంబర్ 04,2020న న్యూ ఢిల్లీలో వెబ్‌నార్‌ విధానంలో నిర్వహించబడింది. వెబ్‌నార్‌కు అధ్యక్షత వహించిన రక్షణమంత్రి  శ్రీ రాజనాథ్ సింగ్..దేశ అభివృద్ధిలో ప్రైవేటు రంగం యొక్క పాత్ర మరియు ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ప్రైవేటు రంగం వృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రోత్సహించిందన్నారు. ఇప్పుడు రక్షణ రంగం కూడా భారత ప్రైవేటు రంగాన్ని  స్వాగతించడానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కొన్ని విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని, తగిన ప్రయోజనం పొందడానికి పరిశ్రమలు ముందుకు రావాలని ఆయన కోరారు.

సదస్సులో రక్షణమంత్రి మాట్లాడుతూ "దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి పోరాడే ప్రక్రియలో మన సైనికులు కొన్నిసార్లు తమ ప్రాణాలను అర్పిస్తారని లేదా వికలాంగులుగా మారుతారని చెప్పారు. "అందువల్ల మన మాజీ సైనికుల పునరావాసం మరియు సంక్షేమం,  అమరవీరుల బంధువులు మరియు వికలాంగ సైనికుల బాధ్యత పౌరులందరిది" అని రక్షణ మంత్రి అన్నారు. ఎఎఫ్‌ఎఫ్‌డి నిధికి తోడ్పడటం ద్వారా ఈ బాధ్యతను నెరవేర్చడానికి మనకు ఈ దినోత్సవం అవకాశాన్ని కల్పిస్తుంది" అన్నారాయన. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో కష్టతరమైన రోజుల్లో కూడా వారు స్థానిక పరిపాలనకు కాంటాక్ట్ ట్రేసింగ్, కమ్యూనిటీ నిఘా మరియు లాక్‌డౌన్‌ నిర్వహణ వంటి పనులలో సహకరించారని  మాజీ సైనికుల సేవా స్ఫూర్తిని ఆయన గుర్తుచేసుకున్నారు.


గత కొన్ని సంవత్సరాలుగా  సిఎస్ఆర్ ద్వారా భారత పరిశ్రమ ఉదార సహకారంతో ఎఎఫ్ఎఫ్‌డిఎఫ్‌లో గణనీయమైన పెరుగుదల ఉందని రక్షణమంత్రి తెలిపారు. గతేడాది ఎఎఫ్‌ఎఫ్‌డి ఫండ్‌కు పరిశ్రమలు అందించిన కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ సైనికుల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రవికాంత్ మాట్లాడుతూ "మాజీ సైనికులు మరియు వారిపై ఆధారపడిన వారి సంక్షేమానికి కేంద్రీయ సైనిక్ బోర్డు (కెఎస్‌బి) కట్టుబడి ఉందని అన్నారు. కార్యదర్శి, కెఎస్బి ఎయిర్ కమోడోర్ బి అహ్లువాలియా సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ నుండి నిధులు సమకూర్చిన సంక్షేమ పథకాల సమావేశాన్ని వివరించారు. మాజీ సైనికులు మరియు వారిపై ఆధారపడిన వారి పునరావాసం మరియు సంక్షేమం కోసం విధానాలను రూపొందించే భారత ప్రభుత్వ అత్యున్నత సంస్థ కేఎస్‌జి. పరిపాలనాపరంగా ఎఎఫ్‌ఎఫ్‌డిఎఫ్‌ను కెఎస్‌బి నియంత్రిస్తుంది.


విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన లేదా వికలాంగులు, వృద్ధులు, పెన్షనర్లు కానివారు, వితంతువులు మరియు అనాథ పిల్లలు అయిన సైనికుల బంధువుల పునరావాసం మరియు సంక్షేమం కోసం ఎఎఫ్‌ఎఫ్‌డి నిధి ఉపయోగించబడుతుంది. పెనరీ గ్రాంట్, ఎడ్యుకేషన్ గ్రాంట్, వితంతువు / కుమార్తె వివాహ మంజూరు వంటి వివిధ పథకాల ద్వారా వారికి ఆర్థిక సహాయం అందించబడుతుంది.

ప్రస్తుతం 32 లక్షలకు పైగా ఈఎస్‌ఎంలు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆరు లక్షల వితంతువుల్లో సుమారు 60,000 మంది ఈఎస్‌ఎంలో చేర్చబడుతున్నారు.

 కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ 135 ప్రకారం సిఎస్ఆర్ బాధ్యతను నెరవేర్చడానికి ఎఎఫ్‌ఎఫ్‌డిఎఫ్‌కు కార్పొరేట్ విరాళాలు అనుమతించబడతాయి "సాయుధ దళాల అనుభవజ్ఞులు, యుద్ధ వితంతువులు మరియు వారిపై ఆధారపడిన వారి ప్రయోజనాల కోసం చర్యలు"  (కంపెనీల చట్టం యొక్క షెడ్యూల్ VII యొక్క క్లాజ్ VI, 2013).

ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80 జి (5) (vi) కింద ఆదాయపు పన్ను నుండి ఎఎఫ్‌ఎఫ్‌డిఎఫ్‌విరాళాలు మినహాయించబడ్డాయి.

ఈ సమావేశంలో రక్షణ ఉత్పత్తి కార్యదర్శి శ్రీ రాజ్ కుమార్ మరియు పరిశ్రమల అధిపతులు మరియు సిఎస్ఆర్ అధిపతులు పాల్గొన్నారు.

ప్రతి ఏడాదిలానే 2020 ఏడాదిలో కూడా డిసెంబర్ 07 న దేశవ్యాప్తంగా సాయుధ దళాల  దినోత్సవం జరుపుకుంటారు. దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడటానికి మన సరిహద్దుల్లో ధైర్యంగా పోరాడే అమరవీరులతో పాటు యూనిఫాంలో ఉన్న స్త్రీపురుషులను గౌరవించే రోజును 1949నుండి ఆచరిస్తున్నారు.

***



(Release ID: 1678625) Visitor Counter : 121