మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జాతీయ రహదారి ప్రాంతాలను దత్తత తీసుకోనున్న ఐఐటిలు, ఎన్‌ఐటిలు, ప్రముఖ సాంకేతిక సంస్థలు


18 ఐఐటిలు 26 ఎన్‌ఐటిలు 190 ఇంజనీరింగ్ కళాశాలలు పథకాన్ని ఎంపిక చేసుకుంటాయి

Posted On: 03 DEC 2020 3:08PM by PIB Hyderabad

పరస్పరం ప్రయోజనం చేకూరే చొరవతో, ఐఐటిలు, ఎన్‌ఐటిలు, ఇతర ఎఐసిటిఇ ఆమోదించిన ఇంజనీరింగ్ కళాశాలలతో సహా దేశవ్యాప్తంగా ప్రసిద్ధ సాంకేతిక సంస్థలు, జాతీయ రహదారి సమీప ప్రాంతాలను స్వచ్చందంగా దత్తత తీసుకునేలా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తో కలిసి పనిచేయనున్నాయి. అధ్యాపకులు, పరిశోధకులు, ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు పరిశ్రమ తాజా పోకడలపై అధ్యయనం చేసే వేదికగా దత్తత తీసుకున్న ప్రాంతాలు ఉపయోగపడతాయి.

ఈ కార్యక్రమాలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆలోచనకు అనుగుణంగా ఇన్స్టిట్యూట్స్, ఇండస్ట్రీ అనుసంధానం అవుతాయని భావిస్తున్నారు. జాతీయ రహదారి ప్రాజెక్టులపై సివిల్ / హైవే ఇంజనీరింగ్ రంగంలో సంబంధిత నైపుణ్యాన్ని వ్యాప్తి చేయడానికి ఇన్స్టిట్యూట్స్, ఎన్‌హెచ్‌ఏఐల మధ్య పరస్పర సహకారానికి ఈ చొరవ దారి వేస్తుంది.

దీని కింద, భాగస్వామి ఇన్స్టిట్యూట్ భద్రత, నిర్వహణ, ప్రయాణ సౌకర్యం, కుచించుకుపోయి ఉన్న పాయింట్ల తొలగింపు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ఉపయోగాలు మొదలైన వాటిలో మెరుగుదల అవకాశాలను అధ్యయనం చేస్తుంది. ఇన్స్టిట్యూట్స్ కొత్త ప్రాజెక్టుల సంభావితీకరణ, రూపకల్పన మరియు ప్రాజెక్ట్ తయారీ సమయంలో కూడా ఎన్హెచ్ఏఐ తో కలిసిసైట్ పరిసరాల వాతావరణం, స్థలాకృతి మరియు మెరుగైన సామాజిక-ఆర్ధిక ఫలితాల కోసం వనరుల సంభావ్యతకు సంబంధించిన అనుభవం ఆధారంగా సంబంధిత పారామితులు మరియు ఆవిష్కరణలను సూచిస్తాయి.

ఈ చొరవ విద్యార్థుల సౌహార్థ్రభావంలో స్థానిక మౌలిక సదుపాయాలను నిర్మించడంలో సహకారాన్ని కలిగిస్తుంది.  ఎన్‌హెచ్‌ఏఐ సంవత్సరానికి 20 యుజి, 20 పీజీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను అందిస్తుంది. ఇంటర్న్‌షిప్ వ్యవధి సంవత్సరంలో ప్రతి విద్యార్థికి 2 నెలలు. ఇంటర్న్‌షిప్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 8000 రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నెలకు రూ.15000 / - రూపాయలు ఉంటుంది. ఇన్స్టిట్యూట్‌లో ల్యాబ్ మౌలిక సదుపాయాల కల్పనకు  ఎన్‌హెచ్‌ఏఐ మద్దతు ఇస్తుంది. ప్రత్యామ్నాయ వనరులను ఉపయోగించడంలో, రహదారుల నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడే సంబంధిత పరిశోధన ప్రాజెక్టుకు స్పాన్సర్ చేయవచ్చు.

తక్కువ వ్యవధిలో అనేక ప్రసిద్ధ సంస్థల నుండి ఎన్‌హెచ్‌ఏఐ కి అధిక స్పందన లభించింది. ఇప్పటివరకు 18 ఐఐటిలు, 26 ఎన్‌ఐటిలు మరియు 190 ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు ఈ పథకాన్ని ఎంచుకున్నాయి. సాంకేతిక సంస్థలు, ఎన్‌హెచ్‌ఏఐల మధ్య దత్తత తీసుకున్నందుకు తగిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు మరియు ఈ పథకం అమలు కోసం ఇప్పటివరకు 200 సంస్థలు ఎంఓయుపై సంతకం చేశాయి. సివిల్ ఇంజనీరింగ్ యుజి మరియు పిజి కోర్సులను అందించే 300 కి పైగా సంస్థలు దేశవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఏఐ విస్తరణలను స్వీకరిస్తాయని భావిస్తున్నారు.

***



(Release ID: 1678157) Visitor Counter : 183