రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఆర్మీ గార్డ్‌ బెటాలియన్‌ మార్పు కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి

Posted On: 28 NOV 2020 1:29PM by PIB Hyderabad

రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఆర్మీ గార్డ్‌ బెటాలియన్‌ మార్పు కార్యక్రమాన్ని రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ వీక్షించారు. తమకు అప్పగించిన మూడున్నరేళ్ల కాలం పూర్తయిన సందర్భంగా, మొదటి గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన ఐదో బెటాలియన్‌, సిఖ్‌ రెజిమెంట్‌కు చెందిన ఆరో బెటాలియన్‌కు బాధ్యతలు అప్పగించింది. 

    సైన్యానికి చెందిన వివిధ పదాతిదళ యూనిట్లు, రాష్ట్రపతి భవన్‌లో 'సెరిమోనియల్‌ ఆర్మీ గార్డ్‌'గా వంతులవారీగా బాధ్యతలు నిర్వహిస్తాయి. రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమాల భద్రతతోపాటు, రాష్ట్రపతి భవన్‌లో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే ప్రముఖులకు గౌరవ వందనం, గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ కవాతులు, బీటింగ్‌ రిట్రీట్‌ వంటి వేడుకల్లో ఈ సైనికులు పాల్గొంటారు. 

    మొదటి గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన ఐదో బెటాలియన్‌, సిఖ్‌ రెజిమెంట్‌కు చెందిన ఆరో బెటాలియన్‌ కమాండింగ్‌ అధికారులు ఒకరోజు తర్వాత రాష్ట్రపతితో సమావేశమవుతారు. విధులు పూర్తి చేసుకుని వెళుతున్న సైనికులతోనూ రాష్ట్రపతి మాట్లాడనున్నారు.

***



(Release ID: 1676730) Visitor Counter : 187